Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైక్ ప్రమాదం తర్వాత నోటి మాట పోయింది : సాయి ధరమ్ తేజ్

Webdunia
బుధవారం, 5 ఏప్రియల్ 2023 (11:47 IST)
బైక్ ప్రమాదం జరిగిన తర్వాత తనకు నోట మాట రాలేదని టాలీవుడ్ మెగా హీరో సాయిధరమ్ తేజ్ అన్నారు. ఆయన నటించిన తాజా చిత్రం "విరూపాక్ష". ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ, బైక్ ప్రమాదం జరిగిన తర్వాత ఆ షాక్‌తో నాకు మాట పడిపోయింది. మాట పడిపోయిన తర్వాత నాకు మాట విలువ తెలిసింది. ఎప్పటిలా మాట్లాడలనే తపన ఎంతగానో ఉండేది. ఆ సమయంలో మాట్లాడటానికి ఎంతగా ప్రయత్నం చేశానో.. ఎంతలా కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసన్నారు. 
 
పైగా, ఈ ప్రమాదం జరగడానికి ముందు రిబబ్లిక్ సినిమాలో నాలుగు పేజీల డైలాగ్‌ను అనర్గళంగా ఏకధాటిగా చెప్పాను. కానీ విరూపాక్ష సినిమా షూటింగులో మాత్రం అరపేజీకి మించి చెప్పలేకపోయాను. ఇందుకోసం నానా అవస్థలు పడ్డాను. కానీ తోటి ఆర్టిస్టులు, చిత్ర బృందం సభ్యులు ఎంతగానో సహకరించారు. కొన్నిసార్లు కేవలం పెదాలను మాత్రమే కదిలించాను. ప్రమాదం తర్వాత హీరోగా నా జర్నీ మొదటి మెట్టు నుంచి మొదలుపెట్టినట్టుగానే ఉంది అని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Delhi murder: బాల్కనీలో ప్రేమికుల గొడవ.. ప్రియురాలిని ఐదో అంతస్థు నుంచి తోసేశాడు..

ప్రియురాలి కోరిక మేరకు ఆమె భర్తను హత్య చేసిన ప్రియుడు...

గోడపై విద్యార్థిని ఫోటో చూస్తూ హస్తప్రయోగం చేసిన ఇంజినీరింగ్ విద్యార్థి, జైలు శిక్ష

3 వేల కార్లతో సముద్రంలో మునిగిపోయిన కార్గో నౌక!!

Man fights off leopard: చిరుతతో పోరాడి గెలిచిన వ్యక్తి.. ఇటుకలు పులిపై విసిరేశారు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

తర్వాతి కథనం
Show comments