Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళ హీరో ధనుష్‌కు ఊరట... మదురై వృద్ధదంపతుల పిటీషన్ కొట్టివేత...

తమిళ హీరో ధనుష్‌కు కోర్టులో భారీ ఊరట లభించింది. ధనుష్ తమ కొడుకేనని, తమ బాగోగులు చూసుకోవటం లేదని పేర్కొంటూ మదురై జిల్లా మేలూర్‌కు చెందిన ఓ వృద్ధ దంపతులు కోర్టుకెక్కిన విషయం తెల్సిందే.

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (12:21 IST)
తమిళ హీరో ధనుష్‌కు కోర్టులో భారీ ఊరట లభించింది. ధనుష్ తమ కొడుకేనని, తమ బాగోగులు చూసుకోవటం లేదని పేర్కొంటూ మదురై జిల్లా మేలూర్‌కు చెందిన ఓ వృద్ధ దంపతులు కోర్టుకెక్కిన విషయం తెల్సిందే. ఈ కేసులో శుక్రవారం మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ తుది తీర్పు వెల్లడించింది. వృద్ధ దంపతులు దాఖలు చేసుకున్న పిటీషన్‌ను కోర్టు కొట్టివేసింది. 
 
హీరో ధనుష్ ఇంతకు క్రితమే తాను వాళ్ల కొడుకును కాదని, తాను 1983లో జులై 28న ఎగ్మోర్ ప్రభుత్వ ఆస్పత్రిలో కృష్ణమూర్తి, విజయలక్ష్మి దంపతులకు జన్మించానని, అప్పట్లో తన పేరు వెంకటేశ్ ప్రభు అని, సినిమాల్లోకి వచ్చాక ధనుష్‌ కె.రాజాగా పేరు మార్చుకున్నానని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. 
 
దీనికి బదులుగా ఆ దంపతులు.. ధనుష్ 1985 నవంబర్7న మదురైలోని ప్రభుత్వ రాజాజీ ఆస్పత్రిలో జన్మించాడని తమ వద్ద ఆధారాలున్నాయని కౌంటర్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. ఇరువురు జనన ధృవీకరణ, విద్యా సంబంధ పత్రాలను సమర్పించాలని ఆదేశించింది. వీటన్నింటితో పాటు.. వైద్య రిపోర్టులు పరిశీలించిన కోర్టు వృద్ధదంపతుల పిటీషన్‌ను కొట్టివేసింది. 

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments