Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు ఇండస్ట్రీ (SPB) బాలుని మరచిపోయిందా..?

Webdunia
శుక్రవారం, 9 అక్టోబరు 2020 (15:05 IST)
గాన గంధర్వుడు బాలు ఇక లేరు అని తెలిసి అందరూ ఎంతగా బాధపడ్డారో తెలిసిందే. ఇప్పటికీ బాలు లేరంటే నమ్మబుద్ధి కావడం లేదు. అయితే... చిత్ర‌సీమ‌లో ఎవ‌రైనా ఓ ప్ర‌ముఖుడు చ‌నిపోతే సంతాప స‌భ పెట్ట‌డం, నివాళి అర్పించ‌డం ప‌రిపాటి. కానీ… బాలు విష‌యంలో అది ఇంతవ‌ర‌కూ జ‌ర‌గ‌లేదు. `క‌రోనా వ‌చ్చిందండీ.. సోష‌ల్ డిస్టెన్సీ ఉండాలండీ` అని క‌బుర్లు చెప్ప‌డానికి ఇప్పుడు వీల్లేదు.
 
ఎందుకంటే... ఎంత క‌రోనా అయినా ప్రైవేటు కార్య‌క్ర‌మాలు బోల్డ‌న్ని జ‌రుగుతున్నాయిప్పుడు. అలాంటప్పుడు బాలు సంతాప సభ పెట్టకపోవడానికి కారణం ఏంటి..? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీకి పెద్ద దిక్కులా ఉంటున్నారు. అలాంటప్పుడు అన్నీ తెలిసిన చిరంజీవిగారు కూడా ఎందుకు బాలు సంతాప సభ విషయంలో సైలెంట్‌గా ఉన్నారో అర్థం కావడం లేదు అనే కామెంట్స్ వినపడుతున్నాయి.
 
బాలుతో అందరికీ అనుబంధం ఉంది. అందరి సక్సెస్‌లో బాలు పాత్ర ఉంది. అలాంటప్పుడు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారనేది సమాధనం లేని ప్రశ్నగా మారింది అంటున్నారు. బాలు మరణించారనే వార్త తెలిసినప్పుడు.. తెలుగు ఇండస్ట్రీలో వాళ్లు బాలుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. 
 
అంతన్నారు ఇంతన్నారు కానీ.. ఇప్పుడు మాత్రం సైలెంట్‌గా ఉన్నారు. ఇదంతా చూస్తుంటే.. బాలుపై చూపించింది అంతా నిజమైన ప్రేమ కాదా..? అనిపిస్తుంది. మరి.. తెలుగు ఇండస్ట్రీ సైలెంట్‌గా ఉండటంపై వస్తున్న విమర్శలపై త్వరలోనే తాళం వేస్తారో లేదంటే కొనసాగేట్లు చేస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments