Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవిపై జాన్వీ కపూర్ ఎమోషనల్ ట్వీట్.. నువ్వు లేని మదర్స్ డే.. అనసూయ కూడా?

Webdunia
ఆదివారం, 12 మే 2019 (13:14 IST)
మదర్స్ డేని పురస్కరించుకుని జాన్వీ కపూర్ ఎమోషనల్ ట్వీట్ చేసింది. మ‌ద‌ర్స్ డే రోజు సెల‌బ్రెటీస్ అంతా త‌మ త‌మ మాతృమూర్తుల‌తో ఉన్న ఫోటోల‌ను.. వాళ్ల‌తో ఉన్న అనుబంధాల‌ను గుర్తు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా అమ్మ గురించి అంతా పొగిడేస్తున్నారు. 
 
ఇక జాన్వీ క‌పూర్ కూడా ఈ లోకంలో లేని తన అమ్మ‌ను త‌లుచుకుంటూ ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టింది. శ్రీ‌దేవి ఉన్న‌పుడు త‌ల్లి చాటు బిడ్డ‌లాగే పెరిగింది జాన్వీ. కానీ ఆమె ఉన్న‌ట్లుండి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో ప్రపంచం ముందుకు వచ్చింది జాన్వీ కపూర్. మదర్స్ డేను పురస్కరించుకుని శ్రీదేవిని తలచుకుని ఎమోషనల్ ట్వీట్ చేసింది. 
 
ఇదే విధంగా ప్రముఖ యాంకర్‌, నటి అనసూయ భరద్వాజ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కథనం’. రాజేశ్‌ నాదెండ్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ చిత్రంలోని తొలి పాట లిరికల్‌ వీడియోను అనసూయ ట్విటర్‌ వేదికగా విడుదల చేశారు.
 
‘చీకటి కొండల్లోనా తూర్పు నువ్వేనమ్మా.. గుడిసె గుండెల్లోనా మెరుపు నువ్వేనమ్మా.. పిలవగానే పలుకుతావే మాకోసమొచ్చిన దేవత’ అంటూ సాగుతున్న ఈ పాట ఎంతో వినసొంపుగా ఉంది. రోషన్‌ సాలూరు ఈ సినిమాకు సంగీతం అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాఫీ బాగోలేదన్నందుకు హత్య చేసారా? కొత్తజంట హనీమూన్ మిస్సింగ్ మిస్టరీ

రౌడీ షీటర్లను పరామర్శించేందుకు వెళ్లిన జగన్... ప్రజా సంఘాల నిరసన

కెనరా బ్యాంకులో దొంగలుపడ్డారు... 59 కేజీల బంగారం మాయం

Kukatpally: కూకట్‌పల్లిలో రూ.2కోట్ల డ్రగ్స్‌తో ముఠా అరెస్ట్

ఆగివున్న ట్యాంకర్‌ను ఢీకొన్న కారు : ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

తర్వాతి కథనం
Show comments