Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవిపై జాన్వీ కపూర్ ఎమోషనల్ ట్వీట్.. నువ్వు లేని మదర్స్ డే.. అనసూయ కూడా?

Webdunia
ఆదివారం, 12 మే 2019 (13:14 IST)
మదర్స్ డేని పురస్కరించుకుని జాన్వీ కపూర్ ఎమోషనల్ ట్వీట్ చేసింది. మ‌ద‌ర్స్ డే రోజు సెల‌బ్రెటీస్ అంతా త‌మ త‌మ మాతృమూర్తుల‌తో ఉన్న ఫోటోల‌ను.. వాళ్ల‌తో ఉన్న అనుబంధాల‌ను గుర్తు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా అమ్మ గురించి అంతా పొగిడేస్తున్నారు. 
 
ఇక జాన్వీ క‌పూర్ కూడా ఈ లోకంలో లేని తన అమ్మ‌ను త‌లుచుకుంటూ ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టింది. శ్రీ‌దేవి ఉన్న‌పుడు త‌ల్లి చాటు బిడ్డ‌లాగే పెరిగింది జాన్వీ. కానీ ఆమె ఉన్న‌ట్లుండి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో ప్రపంచం ముందుకు వచ్చింది జాన్వీ కపూర్. మదర్స్ డేను పురస్కరించుకుని శ్రీదేవిని తలచుకుని ఎమోషనల్ ట్వీట్ చేసింది. 
 
ఇదే విధంగా ప్రముఖ యాంకర్‌, నటి అనసూయ భరద్వాజ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కథనం’. రాజేశ్‌ నాదెండ్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ చిత్రంలోని తొలి పాట లిరికల్‌ వీడియోను అనసూయ ట్విటర్‌ వేదికగా విడుదల చేశారు.
 
‘చీకటి కొండల్లోనా తూర్పు నువ్వేనమ్మా.. గుడిసె గుండెల్లోనా మెరుపు నువ్వేనమ్మా.. పిలవగానే పలుకుతావే మాకోసమొచ్చిన దేవత’ అంటూ సాగుతున్న ఈ పాట ఎంతో వినసొంపుగా ఉంది. రోషన్‌ సాలూరు ఈ సినిమాకు సంగీతం అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో భారీ వర్షాలు- గోడ కూలింది- ఎర్టిగా కారు అటుగా వెళ్లింది.. ఏమైందంటే? (video)

Siddipet: సిద్ధిపేటలో పెట్రోల్ బంకులో షాకింగ్ ఘటన- ఏమైందో తెలుసా? (video)

హైదరాబాదులో భారీ వర్షాలు- కార్ల షోరూమ్‌లో చిక్కుకున్న 30మంది.. ఏమయ్యారు? (video)

ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చిన మహిళతో పోలీసు వివాహేతర సంబంధం, ప్రశ్నించిన భర్తను చితక్కొట్టాడు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments