Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా కాంపౌండ్‌లోకి అడుగుపెడుతున్న "గీత గోవిందం" భామ

Webdunia
సోమవారం, 8 ఏప్రియల్ 2019 (16:06 IST)
అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాని మొదలు పెట్టనున్నారు. అతి త్వరలో ఈ సినిమా షూటింగ్ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాపైన చాలా కాలంగా రూమర్స్ వినిపిస్తున్నప్పటికీ ఈ సినిమా గురించిన ముఖ్య వివరాలను ఫిలిం యూనిట్ ఇప్పటివరకు వెల్లడించలేదు. 
 
ఇది అటుంచితే సోమవారం అల్లు అర్జున్ పుట్టిన రోజును జరుపుకున్నారు. దీన్ని పురస్కరించుకుని మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ సినిమా అనౌన్స్ చేసింది. ఈ సినిమా త్రివిక్రమ్ సినిమా తర్వాత సెట్స్ పైకి వెళ్లనుంది. ఇది వరకే ఈ సినిమా గురించి వార్తలు వచ్చినా ప్రస్తుతం సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. సుకుమార్ ఒక ఆసక్తికరమైన కథని బన్నీ కోసం తయారు చేశారట. 
 
ఇక ఈ సినిమాలో హీరోయిన్ విషయానికి వస్తే, ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించనుంది. ఇప్పటికే మహేష్ బాబు తదుపరి చిత్రంలో నటించే అవకాశాన్ని కైవసం చేసుకున్న రష్మిక, ఇప్పుడు ఈ చిత్రంలో బన్నీ సరసన నటించి అగ్ర కథానాయికల లిస్ట్‌లో చేరిపోతుంది అని భావించవచ్చు. ఈ చిత్రం ద్వారా రష్మిక మందన్నా మెగా కాంపౌండ్‌లోకి అడుగుపెట్టనుందని చెప్పొచ్చు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments