Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమౌళి బాటలో గుణశేఖర్.. 'ప్రతాపరుద్రుడు' టైటిల్‌ రిజిష్టర్..

Webdunia
శనివారం, 1 ఆగస్టు 2015 (14:09 IST)
సినీ దర్శకుడు గుణశేఖర్ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చారిత్రాత్మక చిత్రం 'రుద్రమదేవి' విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాను సెప్టెంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో 'ప్రతాపరుద్రుడు' టైటిల్‌ని 'గుణా టీమ్ వర్క్స్'బ్యానర్‌పై గుణశేఖర్ రిజిష్టర్ చేయించినట్టు ఒక వార్త షికారు చేస్తోంది. దీంతో 'రుద్రమదేవి' తరువాత కూడా గుణశేఖర్ చారిత్మాక చిత్రాన్నే తెరకెక్కించనున్నాడనే టాక్ చిత్ర పరిశ్రమలో హల్‌చల్ చేస్తోంది. 
 
దర్శకుడు రాజమౌళి 'బాహుబలి' తరువాత యుద్ధం నేపథ్యంగా సాగే 'మహాభారతం' చిత్రాన్ని తెరకెక్కించ నున్నాడనే టాక్ వినిపిస్తుండగా, గుణశేఖర్ కూడా ఆయన బాటలో నడుస్తున్నట్టు అనిపిస్తోంది. రుద్రమదేవి తరువాత యుద్ధం నేపథ్యంగా సాగే 'ప్రతాపరుద్రుడు' కథను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అటు రాజమౌళి 'మహాభారతం' విషయంలోను, ఇటు గుణశేఖర్ 'ప్రతాపరుద్రుడు' విషయంలోను అధికారికంగా ప్రకటన వెల్లడికావాల్సి ఉంది.

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

బాలికలతో వ్యభిచారం.. డీఎస్పీ సహా 21 మంది అరెస్టు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

Show comments