Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనసూయకు జీఎస్టీ అధికారుల షాక్.. ఇప్పుడేమంటావ్..?

Webdunia
బుధవారం, 25 డిశెంబరు 2019 (13:56 IST)
ప్రముఖ తెలుగు యాంకర్, సినీ నటి అనసూయకు జీఎస్టీ అధికారులు షాకిచ్చారు. రూ.55 లక్షలు కట్టాలంటూ నోటీసులు జారీ చేశారు. సర్వీస్‌ ట్యాక్స్‌ కింద అనసూయ రూ. 80 లక్షలు బకాయి ఉన్నారు. అయితే, ఆమె కేవలం రూ.25 లక్షలు మాత్రమే కట్టారు. దీంతో, మిగిలిన మొత్తాన్ని కూడా వెంటనే చెల్లించాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. టాలీవుడ్‌‌కు చెందిన పలువురిపై జీఎస్టీ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో.. ఆదాయాన్ని తక్కువగా చూపిస్తూ వీరు ట్యాక్‌ ఎగ్గొడుతున్నారని అధికారులు తెలిపారు. 
 
ఇటీవల యాంకర్లు సుమ కనకాల, అనసూయ భరద్వాజ్, టాలీవుడ్ నటి లావణ్య త్రిపాఠి ఇళ్లపై... జీఎస్టీ అధికారులు దాడులు జరిగాయని వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ ఫేక్ అంటూ యాంకర్లు అనసూయ, సుమ ఖండించారు. సుమ ప్రత్యేకంగా ఓ వీడియోనే పోస్టు చేసింది. అయితే అనసూయ మాత్రం ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలు అంటూ ట్వీట్ చేసింది. 
 
తన ఇంటిలో ఎలాంటి జీఎస్టీ దాడులు జరగలదేని తన సోషల్ మీడియా పేజీల్లో పోస్టు చేసింది. అనసూయ రెండు రోజుల క్రితం తన ఇంటిపై ఎలాంటి ఐటీ రైడ్స్ జరగలేదని.. మీడియా ఎక్కువ చేసిందని కాస్త ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు అధికారులు తాజాగా అనసూయకు నోటీసులు ఇచ్చారు. జీఎస్టీ కట్టాలంటూ పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు అనసూయను నెటిజన్స్, ఆమె అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఏమంటావ్ అంటూ ఆమెను ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KA Paul: చిన్నవాడైన రామ్మోహన్‌కి ఏవియేషన్‌పై అవగాహన లేదు: కే.ఏ.పాల్

భారత్‌లో బోయింగ్ డ్రీమ్ లైనర్ 787-8 విమానాల నిలిపివేత!?

India: దేశంలో ఏడువేల యాక్టివ్ కేసులు.. ఏపీ, తెలంగాణల్లో కేసులెన్ని?

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం: ఆరుగురు చిత్తూరు వాసులు మృతి

10 నిమిషాలు ఆలస్యమై విమానం ఎక్కలేకపోయింది, బతికి బైటపడింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments