Webdunia - Bharat's app for daily news and videos

Install App

డైరెక్టర్స్ ఎస్.ఎస్.రాజమౌళి, క్రిష్ లకు అభినందనలు

Webdunia
బుధవారం, 4 మే 2016 (20:39 IST)
బాహుబలి, కంచె చిత్రాలతో తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలా చాటి జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న దర్శకులు ఎస్.ఎస్.రాజమౌళి, జాగర్లమూడి క్రిష్. భారీ బడ్జెట్, తారాగణం, హై రేంజ్ టెక్నికల్ స్టాండర్డ్స్‌తో తెరకెక్కిన తెలుగు చిత్రం బాహుబలి ది బిగినింగ్ వరల్డ్ వైడ్‌గా తెలుగు సినిమాకు గుర్తింపు తెచ్చింది. అలాగే రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో జాగర్లమూడి క్రిష్ రూపొందించిన చిత్రం కంచె. 
 
బాహుబలి ఉత్తమ చిత్రం, కంచె చిత్రం ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డులను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ అవార్డులను రాష్ట్రపతి చేతుల మీదుగా బాహుబలి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి, నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలు అందుకున్నారు. అలాగే కంచె చిత్రానికి సంబంధించి క్రిష్ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. 
 
ప్రస్తుతం రాజమౌళి బాహుబలి కన్‌క్లూజన్, క్రిష్ బాలకృష్ణ వందవ చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రాలను రూపొందిస్తున్నారు. ఇలా రాజమౌళి, క్రిష్‌లు తమ దర్శకత్వ ప్రతిభతో తెలుగు సినిమాను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటూ వారికి అభినందనలు. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments