Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్ కేసు : సిట్ ముందుకు గాయని గీతామాధురి భర్త...

హైదరాబాద్‌ డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖుల సిట్ విచారణ చివరి అంకానికి చేరుకుంది. నోటీసులు జారీ చేసిన 12 మంది సినీ ప్రముఖుల విచారణ మంగళవారంతో ముగియనుంది. సినీ ప్రముఖుల్లో చివరివాడైన గాయని గీతామాధురి భర్త

Webdunia
మంగళవారం, 1 ఆగస్టు 2017 (10:41 IST)
హైదరాబాద్‌ డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖుల సిట్ విచారణ చివరి అంకానికి చేరుకుంది. నోటీసులు జారీ చేసిన 12 మంది సినీ ప్రముఖుల విచారణ మంగళవారంతో ముగియనుంది. సినీ ప్రముఖుల్లో చివరివాడైన గాయని గీతామాధురి భర్త నందు కొద్దిసేపటి క్రితం నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకున్నాడు. తన తండ్రి, మేనమామతో కలసి సిట్ కార్యాలయానికి వచ్చాడు. 
 
ఈ కేసులో ప్రధాన నిందితుడైన కెల్విన్ మొబైల్ ఫోన్‌లో నందు నంబర్ ఉండటం, వారిద్దరి మధ్యా జరిగిన వాట్స్ యాప్ సంభాషణల ఆధారంగా నందును విచారణకు పిలిపించిన అధికారులు, సుమారు 60 వరకూ ప్రశ్నలను సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విచారణ పూర్తయిన తర్వాత అరెస్టుల పర్వం కొనసాగవచ్చని తెలుస్తోంది. 
 
కాగా, ఈ కేసులో ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్, సినిమాటోగ్రఫర్ శ్యామ్ కె.నాయుడు, హీరోలు తరుణ్, నవదీప్, రవితేజ, తనీష్, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, ముమైత్ ఖాన్, ఛార్మీ తదితరులు విచారణ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

PM Modi: కాట్రా పట్టణం నుండి శ్రీనగర్‌కు వందే భారత్ రైలు సర్వీస్ ప్రారంభం

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

ట్రావెల్ బ్యాగులో మృతదేహం మిస్టరీని ఛేదించిన పోలీసులు..

మిస్ గ్రాండ్ ఇండియా 2025 పోటీల ఫైనలిస్టుగా తెలుగమ్మాయి..

TTD Ghee Case: టీటీడీ ఉద్యోగులపై వేటు.. వరుస నోటీసులకు సిట్ సన్నద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments