Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్ కేసు : సిట్ ముందుకు గాయని గీతామాధురి భర్త...

హైదరాబాద్‌ డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖుల సిట్ విచారణ చివరి అంకానికి చేరుకుంది. నోటీసులు జారీ చేసిన 12 మంది సినీ ప్రముఖుల విచారణ మంగళవారంతో ముగియనుంది. సినీ ప్రముఖుల్లో చివరివాడైన గాయని గీతామాధురి భర్త

Webdunia
మంగళవారం, 1 ఆగస్టు 2017 (10:41 IST)
హైదరాబాద్‌ డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖుల సిట్ విచారణ చివరి అంకానికి చేరుకుంది. నోటీసులు జారీ చేసిన 12 మంది సినీ ప్రముఖుల విచారణ మంగళవారంతో ముగియనుంది. సినీ ప్రముఖుల్లో చివరివాడైన గాయని గీతామాధురి భర్త నందు కొద్దిసేపటి క్రితం నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకున్నాడు. తన తండ్రి, మేనమామతో కలసి సిట్ కార్యాలయానికి వచ్చాడు. 
 
ఈ కేసులో ప్రధాన నిందితుడైన కెల్విన్ మొబైల్ ఫోన్‌లో నందు నంబర్ ఉండటం, వారిద్దరి మధ్యా జరిగిన వాట్స్ యాప్ సంభాషణల ఆధారంగా నందును విచారణకు పిలిపించిన అధికారులు, సుమారు 60 వరకూ ప్రశ్నలను సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విచారణ పూర్తయిన తర్వాత అరెస్టుల పర్వం కొనసాగవచ్చని తెలుస్తోంది. 
 
కాగా, ఈ కేసులో ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్, సినిమాటోగ్రఫర్ శ్యామ్ కె.నాయుడు, హీరోలు తరుణ్, నవదీప్, రవితేజ, తనీష్, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, ముమైత్ ఖాన్, ఛార్మీ తదితరులు విచారణ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments