Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోర్బ్స్ ఇండియా జాబితాలో కోహ్లీదే అగ్రస్థానం.. మహేష్, ప్రభాస్‌లకు చోటు

Webdunia
శుక్రవారం, 20 డిశెంబరు 2019 (15:22 IST)
ఫోర్బ్స్ ఇండియా జాబితాలో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ అగ్రస్థానాన్ని సంపాదించాడు. ఈ ఏడాది అత్యధిక సంపాదన, గడించిన పేరు ప్రఖ్యాతలు సంపాదించి ద్వారా ఈ ఏడాది అత్యధిక సంపాదన, గడించిన పేరు ప్రఖ్యాతులు ఆధారంగా వందమంది ప్రముఖుల జాబితాను ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసింది. కోహ్లీ తర్వాతి స్థానంలో బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, సల్మాన్‌ఖాన్‌లు ఉన్నారు. 
 
టాలీవుడ్ నటులు ప్రభాస్, మహేశ్‌బాబులు వరుసగా 44, 54వ స్థానాల్లో నిలిచారు. గతేడాది అక్టోబరు 1 నుంచి ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకు వారు ఆర్జించిన సంపాదన ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు. 
 
ఈ జాబితాలో కోహ్లీ రూ.252.72 కోట్ల ఆదాయంతో అగ్రస్థానంలో ఉండగా, రూ.293.25 కోట్లతో అక్షయ్ కుమార్, రూ.229.25 కోట్లతో సల్మాన్ ఖాన్ రెండు మూడు స్థానాల్లో నిలిచారు. ఇక, దక్షిణాదికి చెందిన ప్రముఖుల్లో.. సూపర్ స్టార్ రజనీకాంత్ వంద కోట్ల రూపాయల ఆదాయంతో 13వ స్థానంలో నిలవగా, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ 94.8 కోట్ల ఆదాయంతో 16వ స్థానంలో నిలిచాడు. రూ.35 కోట్లతో ప్రభాస్ 44వ స్థానంలో, 35 కోట్లతో మహేశ్ బాబు 54వ స్థానంలో ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రైలు టిక్కెట్ కౌంటర్ల వద్ద క్యూ లైన్లకు ముగింపు.. ఎలా?

Social media: సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకోవాలి.. జగన్

ఏఐ ఫర్ ఆంధ్రా పోలీస్ హ్యాకథాన్-2025లో రెండో స్థానంలో నిల్చిన క్వాడ్రిక్ ఐటీ

దేవుడు అన్నీ చూస్తున్నాడు... దేవుడు శిక్షిస్తాడు : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం

శ్రీలంకలో భారతీయ మైస్ కార్యకలాపాలు విస్తృతం: హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీలంక టూరిజం ప్రోగ్రాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments