పూరికి 20 యేళ్ళ సినీ కెరీర్‌ .. ఇంకా తీరని రెండు కోర్కెలు

Webdunia
సోమవారం, 20 ఏప్రియల్ 2020 (13:40 IST)
తెలుగు చిత్రపరిశ్రమలోని డాషింగ్ డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ ఒకరు. ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఏప్రిల్ 20వ తేదీతో 20 యేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ రెండు దశాబ్దాల సుధీర్ఘకాలంలో ఆయన ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూశారు. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుల్లో ఒకరిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. 
 
పైగా, మాస్ ఇమేజ్ కోరుకునే హీరోలు ఆయన సినిమాల్లో చేయాలని ఆరాటపడుతుంటారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన తొలి చిత్రమైన 'బద్రి'. హీరో పవన్ కళ్యాణ్. ఈ చిత్రం 2000 సంవత్సరంలో ఏప్రిల్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవన్ కల్యాణ్  కెరియర్లో చెప్పుకోదగిన సినిమాగా 'బద్రి' నిలిచిపోయింది. 
 
ఆ తర్వాత మహేశ్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, అల్లు అర్జున్, రామ్ వంటి యువ కథానాయకులతో పలు చిత్రాలు తీసిన పూరి సంచలన విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. సీనియర్ స్టార్ హీరోల్లో నాగార్జున, బాలకృష్ణ, రవితేజలతోనూ సినిమాలు చేశారు.
 
అయితే, ఈ 20 ఏళ్లలో 35 సినిమాలను తెరకెక్కించిన పూరి జగన్నాథ్.. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్‌లతో మాత్రమే సినిమా చేయలేకపోయారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో కొన్ని ప్రాజెక్టులు అనుకున్నప్పటికీ అవి పట్టాలెక్కలేదు. 
 
నిజానికి చిరంజీవి రీఎంట్రీ తర్వాత వచ్చిన 150వ చిత్రానికి తొలుత పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తారని అందరూ భావించారు. కానీ, అది వివి వినాయక్‌కు దక్కింది. ఈ పరిస్థితుల్లో మున్ముందు ఆ లోటును పూరి భర్తీ చేసుకుంటాడేమో చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Revanth Reddy: ఒకే వేదికపై రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ.. రేవంత్ ప్లాన్ సక్సెస్ అవుతుందా?

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments