Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్న వనిత.. అయినా తలనొప్పి తప్పట్లేదు.. (video)

Webdunia
సోమవారం, 29 జూన్ 2020 (20:05 IST)
Vanitha Vijayakumar
దక్షిణాది లేడి సూపర్ స్టార్ నయనతార గతంలో కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో ప్రేమాయణం సాగించింది. ఈ ప్రేమాయణం పెళ్ళిపీటల వరకు వచ్చింది. కానీ తొలి భార్య సెగతో ఈ వివాహం ఆగిపోయిందని.. ఆ సమయంలో నయన రెండో భార్య కానుందనే వార్తలు ఆమె ఫ్యాన్సును నొప్పించాయి. దీంతో ఏమనుకుందో ఏమో కానీ నయన ప్రభుదేవాకు బ్రేకప్ చెప్పేసింది. ప్రస్తుతం విఘ్నేశ్ శివన్‌తో క్లోజ్‌గా వుంది. ఇటీవల కూడా నయనపై ప్రభుదేవా తొలి భార్య విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. 
 
ఇదే తరహాలో ప్రస్తుతం మూడో పెళ్లి చేసుకున్న ప్రముఖ నటుడు విజయ్ కుమార్ కూతురు వనితకు సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. ఫిలింమేకర్ పీటర్ పాల్‌ను క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంది. పీటర్ పాల్‌కు గతంలోనే వివాహమైంది. ఇప్పుడు పీటర్ పాల్ మొదటి భార్య ఎలిజబెత్ చెన్నై, వడపళని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
తన నుంచి విడాకులు తీసుకోకుండానే మరో పెళ్లి చేసుకున్నాడని, పీటర్ పాల్‌పై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో కోరింది. తమకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, తాము గత ఏడేళ్లుగా వేర్వేరుగా ఉంటున్నామని వెల్లడించింది. 
Vanitha Vijayakumar
 
కాగా, నటి వనిత విజయ్ కుమార్‌కు గతంలో ఆకాశ్, ఆనంద్ జే రాజన్‌లతో వివాహాలు జరిగాయి. కొంతకాలం రాబర్ట్ అనే వ్యక్తితోనూ డేటింగ్ చేసినట్టు ప్రచారం జరిగింది. అంతేకాదు, తన తండ్రి విజయ్ కుమార్‌తో ఆస్తి వివాదాల్లోనూ ఆమె పేరు ఎక్కువగా వినిపించింది. ప్రస్తుతం ఈ వివాదాలను పక్కనబెట్టి ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నా.. వనితకు పీటర్ మొదటి భార్యతో తలనొప్పి తప్పేలా లేదు. 

Vanitha Vijayakumar

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: భూ వివాదం ఒక ప్రాణాన్ని బలిగొంది.. నలుగురు కుమారుల మధ్య..?

భర్త తప్పిపోయాడని క్షుద్ర వైద్యుడి దగ్గరికి వెళ్తే.. అసభ్యంగా ప్రవర్తించాడు.. ఏం చేశాడంటే?

కర్నూలులో వరుస హత్యలు.. భయాందోళనలో ప్రజలు

Heavy rainfall: బంగాళాఖాతంలో అల్పపీడనం- తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్

Kavitha: కవితకు బిగ్ షాకిచ్చిన కేటీఆర్‌.. పార్టీ నుంచి సస్పెండ్.. హరీష్ ఆరడుగుల బుల్లెట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments