Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాతిపిత మహాత్మా గాంధీని రజనీకాంత్‌ కలవడమేంటి? సోషల్ మీడియాలో ఫోటో వైరల్..!

తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ కబాలికి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. కబాలి వీరాభిమానుల గురించి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఒక్కోసారి వారి అభిమానం హద్దులు

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2016 (15:53 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ కబాలికి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. కబాలి వీరాభిమానుల గురించి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఒక్కోసారి వారి అభిమానం హద్దులు దాటిపోతోంది. ఇప్పటికే అభిమానుల చేష్టలతో రజనీపై సోషల్ మీడియాలో రకరకాల జోకులు పేలుతున్నాయి. తాజాగా అభిమానులు పోస్ట్ చేసిన ఓ ఫోటో జాతిపిత మహాత్మాగాంధీని కూడా వివాదాల్లోకి లాగే పరిస్థితి ఏర్పడింది. 
 
1948లో మరణించిన జాతిపిత మహాత్మా గాంధీని 1950లో పుట్టిన రజనీకాంత్‌ కలవడమేంటి? నిజమా అనుకుంటున్నారా? నిజమేనండి. జాతిపితతో రజనీ కాంత్ మాట్లాడుతున్నట్లు గల ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో సెటైర్లు ఎదుర్కొంటోంది. మహాత్ముడితో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మాట్లాడుతున్నట్టున్న ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 
 
ఫోటో షాప్ సాయంతో రజనీ బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమా నుంచి ఓ స్టిల్‌ తీసుకుని దానికి మహాత్ముడిని తగిలించి సోషల్‌ మీడియాలో వదిలేశారు. అంతటితో వదలకుండా స్వాతంత్ర్య ఉద్యమంలో రజనీకాంత్‌కు మహాత్ముడి అభినందనలు అంటూ కూడా కామెంట్స్ పెట్టేశారు. ఇక రజనీ సరికొత్త బాంబులు పేలుతున్నాయి.

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

బాలికలతో వ్యభిచారం.. డీఎస్పీ సహా 21 మంది అరెస్టు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments