Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేక్ న్యూస్ రాసే వెబ్ సైట్ల పైన ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాము

Webdunia
మంగళవారం, 5 మే 2020 (14:09 IST)
హీరో విజయ్ దేవరకొండ తెలుగులో వెబ్‌సైట్లు కావాలనే విపరీతంగా తప్పుడు వార్తలు రాస్తున్నాయని.. అందులో ముఖ్యంగా రెండు మూడు వెబ్‌సైట్స్ మాత్రం ఏ మాత్రం అర్హత లేకుండా ఇంటర్వ్యూలు ఇవ్వకపోతే కూడా కక్ష పెట్టుకుని రాస్తున్నారంటూ మండిపడ్డాడు. విజయ్ దేవరకొండ ఈ విషయంపై మాట్లాడిన తరువాత చిరంజీవి, మహేష్ బాబు, రవితేజ, అల్లరి నరేష్, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, కొరటాల శివ తదితరులు విజయ్ దేవరకొండకు మద్దతు తెలిపారు.
 
తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఫేక్ న్యూస్, ఫేక్ వెబ్సైట్స్‌ను ఖండిస్తోంది. అసత్యంగా వార్తలు రాసే వెబ్ సైట్స్‌ను వ్యతిరేకిస్తోంది. హీరోలు దర్శకులు విజయ్ దేవరకొండకు సపోర్ట్ చెయ్యడాన్ని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సమర్థిస్తుంది. ఒక మనిషి తన స్తోమతకు తగ్గట్లు సహాయం చేస్తాడు, దానిపై కూడా కామెంట్స్ చెయ్యడం కరెక్ట్ కాదు. 
 
సినిమా యాడ్స్ వలన రెవిన్యూ పొందుతూ ఇలా సినిమా వారిపైన ఆ వెబ్ సైట్ ఆర్టికల్స్ రాయడం కరెక్ట్ కాదు, ఈ విషయం పైన లాక్ డౌన్ పూర్తి తరువాత అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాము, ఎవరికైనా ఫేక్ న్యూస్ రాసే వెబ్సైట్స్ పైన పిర్యాదు చేస్తే మేము చర్యలు తీసుకుంటామని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేసీఆర్ చుట్టూత కొన్ని దెయ్యాలు ఉన్నాయ్ : ఎమ్మెల్సీ కవిత

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

Bus Driver: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. సీటులోనే కుప్పకూలిపోయాడు.. కండెక్టర్ ఏం చేశాడు? (video)

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments