మెంటల్ టార్చర్ అనుభవిస్తున్నా.. చానళ్ళపై పరువు నష్టం దావా : అషు రెడ్డి

Webdunia
మంగళవారం, 27 జూన్ 2023 (16:41 IST)
హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన డ్రగ్స్ దందా కేసులో పలువురు సినీ సెలెబ్రిటీల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా తెలుగు "కబాలీ" చిత్ర నిర్మాత కేపీ చౌదరికి చెందిన నాలుగు మొబైల్ ఫోన్ల కాల్ లిస్టులో అనేక మంది హీరో హీరోయిన్లు, జూనియర్ ఆర్టిస్టుల పేర్లు ఉన్నాయి. ఈ జాబితా లీక్ కావడంతో టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇందులో ప్రధానంగా హీరోయిన్ అషు రెడ్డి, మరో నటి సురేఖ వాణీ పేర్లు ఉన్నట్టు సమాచారం. దీంతో వారిద్దరూ మీడియా ముందుకు వచ్చి, ఈ డ్రగ్స్ దందాతో తమకెలాంటి సంబంధం లేదని నెత్తిన నోరు బాదుకుని చెపుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో అషు రెడ్డి మరోమారు తాజాగా స్పందించారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. డ్రగ్స్ కేసులో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికే పలుమార్లు చెప్పినప్పటికీ గత రెండు రోజులుగా పలు రకాలైన న్యూస్ చానెల్స్‌లో తన పేరును, ఫోన్ నంబరును కూడా వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. కేపీ చౌదరితో తాను వందల కాల్స్ మాట్లాడినట్టుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మీడియాలో వస్తున్న వార్తా కథనాలతో గత రెండు రోజులుగా మెంటల్ టార్చర్‌ను అనుభవిస్తున్నట్టు చెప్పారు. 
 
తనకు ఈ కేసుతో సంబంధం లేకపోయినా తన గురించి ఇష్టంవచ్చినట్టు మాట్లాడుతున్నారని అషురెడ్డి ఆవేదన వ్యక్తం చేసింది. తన నంబర్‌ను వేయడంతో తనకు వందల ఫోన్ కాల్స్ వస్తున్నాయని, దీంతో విధిలేని పరిస్థితుల్లో ఫోన్ స్విచాఫ్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. తనను కించపరిచే విధంగా కథనాలు ప్రసారం చేసే మీడియాపై పరువు నష్టం దావా వేస్తానని అషు రెడ్డి హెచ్చరించారు. తనకు కూడా కెరియర్, కుటుంబం ఉందనే విషయాన్ని మీడియా ప్రతినిధులు గుర్తు పెట్టుకోవాలని హితవు పలికింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణా నదికి భారీ వరద, ప్రకాశం బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక

ఢిల్లీ రాజకీయాల్లో బీఆర్ఎస్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.. కేటీఆర్ వీడియో వైరల్

మొంథా తుఫాను వల్ల రూ.5265 కోట్ల ఆర్థిక నష్టం.. చంద్రబాబు ప్రకటన

పాలిటిక్స్‌ను పక్కనబెట్టి హరీష్ రావు ఇంటికి వెళ్లిన కల్వకుంట్ల కవిత

భిక్షాటన నివారణ చట్టం అమల్లోకి... ఇకపై ఏపీలో భిక్షాటన చేసేవాళ్లను...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments