Webdunia - Bharat's app for daily news and videos

Install App

11 యేళ్ల వైవాహిక బంధానికి ముంగింపు పలికిన ఈషా డియోల్

ఠాగూర్
బుధవారం, 7 ఫిబ్రవరి 2024 (10:28 IST)
బాలీవుడ్ చిత్రపరిశ్రమకు చెందిన మరో హీరోయిన్ తన వైవాహిక బంధానికి తెరదించారు. తన భర్తతో ఉన్న 11 యేళ్ల వివాహబంధానికి ముగింపు పలికారు. ఆమె ఎవరో కాదు.. ప్రముఖ సీనియర్ నటి హేమమాలిని కుమార్తె ఈషా డియోల్. ఈమె తన భర్త భర్త తఖ్తానీతో ఉన్న వివాహ బంధాన్ని తెంచుకున్నారు. భర్తతో కలిసి సంయుక్త ప్రకటన చేశారు. పరస్పర అంగీకారంతో, స్నేహపూర్వకంగా విడిపోతున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం తమ బిడ్డల భవిష్యత్తే ముఖ్యమని ప్రకటించారు. అందువల్ల ఈ క్లిష్ట సమయంలో తమ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దని ఆమె మీడియాకు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు. 
 
కాగా, హేమమాలిని - ధర్మేంద్ర కుమార్తెగా గత 2002లో "కోయి మేర్ దిల్ సే పూఛే" చిత్రంతో సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఈషా డియోల్... ఆ తర్వాత పలు హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఆ తర్వాత నటనకు దూరమయ్యారు. 2012లో భరత్ తఖ్తానీ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు. వీరికి మిరాయా, రాధ్యా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వివాహం, పిల్లలు కారణంగా కొంతకాలం పాటు నటనకు బ్రేక్ తీసుకున్న ఈషా డియోల్.. కేక్ వాక్ అనే ష్టార్ ఫిల్మ్ ద్వారా మళ్లీ తెరంగేట్రం చేశారు. ఈ నేపథ్యంలో ఇపుడు తన వివాహ బంధానికి ముంగిపు పలుకుతున్నట్టు వారు ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments