ERROR500 టీజర్ ఆవిష్క‌రించిన తలసాని శ్రీనివాస్ యాదవ్

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2022 (15:35 IST)
Thalasani Srinivas Yadav, Jaswant Padala, Sandeep
మైత్రేయ మోషన్ పిక్చర్స్యు పతాకంపై యు.బాలరెడ్డి (ఇన్ఫోసిటీ బిల్డర్స్) నిర్మాతగా నటుడు జస్వంత్ పడాల (జెస్సీ), నక్షత్ర త్రినయని ప్రధాన పాత్రలలో సాందీప్ మైత్రేయ ఎన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ERROR500''. తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ చిత్రం టీజర్ ని లాంచ్ చేశారు.
 
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ..మైత్రేయ మోషన్ పిక్చర్స్యు నిర్మిస్తున్న  'ERROR500'' చిత్రం టీజర్ ని లాంచ్ చేయడం ఆనందంగా వుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో యువత రావాల్సిన అవసరం వుంది. యువతని ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తున్నారు. ERROR500 యూనిట్ చాలా ప్యాషన్ ఈ సినిమా చేశారు. ఈ సినిమా యూనిట్ అందరికీ అభినందనలు. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి'' అని కోరారు.
 
జస్వంత్ మాట్లాడుతూ, మా డెబ్యు మూవీకి తలసాని శ్రీనివాస్  టీజర్ లాంచ్ చేయడం గొప్ప ఆశీర్వదంగా అనిపించింది.  'ERROR500' అందరికీ కనెక్ట్ అవుతుంది. సినిమా చాలా బాగా వచ్చింది. నన్ను హీరోగా పరిచయం చేసిన త్రేయ మోషన్ పిక్చర్స్యు కి కృతజ్ఞతలు. సినిమా చాలా బాగా వచ్చింది. త్వరలోనే ప్రేక్షకులు ముందుకు వస్తోంది'' అన్నారు
 
దర్శకుడు సాందీప్ మాట్లాడుతూ.. 'ERROR500'' దర్శకుడిగా నా తొలి చిత్రం. మంత్రివర్యులు  తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు టీజర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా వుంది. ERROR500' మంచి ఎంటర్ టైనర్. బిగ్ బాస్ ఫేం జస్వంత్ ని మేము లాంచ్ చేయడం ఆనందంగా వుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది'' అన్నారు.
 
ఫణి కళ్యాణ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి శశాంక్ శ్రీరామ్ & ప్రశాంత్ మన్నె సినిమాటోగ్రఫీ, గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments