Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్‌కు ఈడీ సమన్లు

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (12:17 IST)
బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ బచ్చన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తేరుకోలేని షాకిచ్చింది. పనామా పత్రాల లీకేజీ కేసులో ఆమెకు ఈడీ సమన్లు జారీచేసింది. సోమవారం ఆమె ఈడీ కార్యాలయానికి హాజరుకావాలని అందులో పేర్కొన్నారు.

అయితే, ఈ రోజు తాను విచారణకు రాలేని, విచారణకు మరో తేదీని మార్చాలని ఐశ్వార్యా రాయ్ ఈడీ అధికారులను కోరినట్టు సమాచారం. దీనిపై ఈడీ అధికారులు స్పందించాల్సివుంది. 
 
ఇదిలావుంటే, పనామా కేసులో ఐశ్వర్యా వాంగ్మూలానాన్ని ఈడీ అధికారులు నమోదు చేయనున్నారు. ఈమెకు ఇదే కేసులో గతంలో ఈడీ పలుమార్లు సమన్లు జారీ చేసింది. అపుడు కూడా ఆమె విచారణ తేదీలను మార్చాలని కోరారు. 
 
మరోవైపు, ఈ కేసులో ఆమె భర్త, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్‌కు ఈడీ అధికారులు సమన్లు జారీచేసి విచారించిన విషయం తెల్సిందే. ఆ సమయంలో ఆయన ఈడీకి కొన్ని పత్రాలను అందచేసినట్టు సమాచారం. కాగా, అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ పనామా కేసులో విచారణ ఎదుర్కొంటుండటం ఇపుడు బాలీవుడ్ చిత్రపరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Double Decker Buses: విశాఖ వాసులకు గుడ్ న్యూస్- త్వరలో డబుల్ డెక్కర్ బస్సులు

NTR: ఎన్టీఆర్ 102వ జయంతి: నివాళులు అర్పించిన ప్రధాని మోదీ, చంద్రబాబు

YS Sharmila: ఏపీలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం.. జూన్ 9 నుంచి వైఎస్ షర్మిల రాష్ట్ర పర్యటన

UP: ఆరోగ్యం బాగోలేదు.. శృంగారానికి నో చెప్పిందని గొంతు కోసి చంపేశాడు..

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు: బీఎస్ఎఫ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

చింత చిగురు వచ్చేసింది, తింటే ఏమవుతుంది?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

తర్వాతి కథనం
Show comments