Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్‌కు ఈడీ సమన్లు

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (12:17 IST)
బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ బచ్చన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తేరుకోలేని షాకిచ్చింది. పనామా పత్రాల లీకేజీ కేసులో ఆమెకు ఈడీ సమన్లు జారీచేసింది. సోమవారం ఆమె ఈడీ కార్యాలయానికి హాజరుకావాలని అందులో పేర్కొన్నారు.

అయితే, ఈ రోజు తాను విచారణకు రాలేని, విచారణకు మరో తేదీని మార్చాలని ఐశ్వార్యా రాయ్ ఈడీ అధికారులను కోరినట్టు సమాచారం. దీనిపై ఈడీ అధికారులు స్పందించాల్సివుంది. 
 
ఇదిలావుంటే, పనామా కేసులో ఐశ్వర్యా వాంగ్మూలానాన్ని ఈడీ అధికారులు నమోదు చేయనున్నారు. ఈమెకు ఇదే కేసులో గతంలో ఈడీ పలుమార్లు సమన్లు జారీ చేసింది. అపుడు కూడా ఆమె విచారణ తేదీలను మార్చాలని కోరారు. 
 
మరోవైపు, ఈ కేసులో ఆమె భర్త, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్‌కు ఈడీ అధికారులు సమన్లు జారీచేసి విచారించిన విషయం తెల్సిందే. ఆ సమయంలో ఆయన ఈడీకి కొన్ని పత్రాలను అందచేసినట్టు సమాచారం. కాగా, అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ పనామా కేసులో విచారణ ఎదుర్కొంటుండటం ఇపుడు బాలీవుడ్ చిత్రపరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్ భూకంపం : 2700 దాటిన మృతుల సంఖ్య... మరింతగా పెరిగే ఛాన్స్..!!

కేవైసీ పూర్తయ్యాక.. కొత్త రేషన్ కార్డులు ఇస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్

రాజకీయాలు పూర్తిస్థాయి ఉద్యోగం కాదు : సీఎం యోగి ఆదిత్యనాథ్

నిత్యానంద నిజంగా చనిపోయారా? సోషల్ మీడియాలో వీడియో హల్చల్

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోదు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments