Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనీ లాండరింగ్ కేసు.. మోహన్ లాల్‌కు నోటీసులు

Webdunia
శనివారం, 14 మే 2022 (19:48 IST)
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మనీ లాండరింగ్ వ్యవహారంతో చిక్కుల్లో పడ్డారు. మనీ లాండరింగ్ వ్యవహారం కింద ఆయనకు ఈడీ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం అందుతోంది. వ‌చ్చే వారం విచార‌ణ‌కు రావాలంటూ ఈడీ అధికారులు ఆయ‌న‌కు నోటీసులు జారీ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. విచార‌ణ కోసం కొచ్చిలోని ఈడీ కార్యాల‌యానికి రావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నట్టు సమాచారం. 
 
కేర‌ళ‌కు చెందిన వ్యాపారి మాన్స‌న్ మాన్క‌ల్‌తో క‌లిసి మోహ‌న్ లాల్ మ‌నీ ల్యాండ‌రింగ్‌కు పాల్ప‌డిన‌ట్టు ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో మాన్స‌న్‌ను గ‌తేడాది సెప్టెంబ‌ర్‌లోనే కేర‌ళ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసుపై దృష్టి సారించిన ఈడీ.. మాన్స‌న్‌తో క‌లిసి మోహ‌న్ లాల్ కూడా మ‌నీ ల్యాండ‌రింగ్‌కు పాల్ప‌డిన‌ట్టు భావిస్తోంది.
 
ఈ విష‌యం నిర్ధార‌ణ కోస‌మే ఆయ‌న‌కు నోటీసులు జారీ చేసిన‌ట్లు తెలుస్తోంది. మొత్తానికి మోహన్ లాల్‌‌కు ఈడీ నోటీసులు పంపించందనే వార్త మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మోహన్ లాల్ ప్రస్తుతం బిగ్ బాస్ షోతో పాటు, తన సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేదర్నాథ్ హైవేపై హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్

వివాహేతర సంబంధం: భార్య తల నరికి స్కూటర్ ఫుట్‌బోర్డుపై పెట్టుకెళ్తున్న భర్త

మూడేళ్ల పాపపై అత్యాచారం-తాటతీసిన పోలీసులు- 20 గంటల్లో ఎన్‌కౌంటర్ చేసేశారు..

యువతితో హోటల్ గదిలో బీఆర్ఎస్ నేత.. భార్య చేతిలో అడ్డంగా దొరికిపోయాడు..

Warangal: వరంగల్‌ ప్రభుత్వ కార్యాలయం ఉద్యోగుల రాసలీలలు- లిప్ లాక్‌లు, కౌగిలింతలు..(video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments