ఈవెంట్ మేనేజర్‌ ఫిర్యాదుతో చిక్కుల్లో పడిన హీరోయిన్.. సీసీబీ ఆరా!

Webdunia
మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (11:07 IST)
కన్నడ చిత్ర పరిశ్రమలు డ్రగ్స్ వ్యవాహారం ఓ కుదుపు కుదుపుతోంది. ఇప్పటికే శాండిల్‌వుడ్ నటి రాగిణి ద్వివేదిని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు అరెస్టు చేశారు. ఇపుడు మరో హీరోయిన్ సంజన గల్రానీ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈవెంట్ మేనేజరు ప్రీతమ్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈమె ఇంట్లో సీసీబీ పోలీసులు సోదాలు నిర్వహించారు. 
 
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ మూలాలు వెలుగు చూశాయి. దీనిపై సీసీబీ పోలీసులు ఆరా తీయగా, కీలక సమాచారాన్ని రాబట్టారు. సీసీబీ అరెస్టు చేసిన డ్రగ్స్ ముఠా నుంచి ఈ సమాచారాన్ని సేకరించారు. ఇందులో ఎవ‌రెవ‌రు ఉన్నార‌నే దానిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. 
 
ఈ క్రమంలో న‌టి రాగిణి ద్వివేదిని పోలీసులు అరెస్ట్ చేయ‌గా, తాజాగా సంజ‌న ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వ‌హించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఈవెంట్ మేనేజ‌ర్ ప్రీత‌మ్ ఇచ్చిన ఫిర్యాదుతో బెంగ‌ళూరులోని ఇందిరా న‌గ‌ర్‌లో ఉన్న సంజ‌న ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు. 
 
ఈ సోదాల‌లో కీల‌క ఆధారాలు ల‌భ్య‌మైతే సంజ‌న‌ని అరెస్టు చేయ‌డం ఖాయం అని అంటున్నారు. ఇంక ఈమె ద్వారా డ్ర‌గ్స్ ఉచ్చులో ఇంకెంత‌మంది చిక్కుకున్నార‌నే విష‌యాన్ని రాబ‌ట్ట‌నున్నారు. తాజాగా ఈ కేసులో డిజైనర్ నియాజ్‌ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృత్రిమ మేధతో మానవాళికి ముప్పుకాదు : మంత్రి నారా లోకేశ్

పాకిస్తాన్ కొత్త చట్టం: పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మారణహోమం చేసినా జీవితాంతం అరెస్ట్ చేయరట

అచ్యుతమ్ కేశవమ్, అలీనగర్‌లో ఆర్జేడీకి షాకిచ్చిన మైథిలీ ఠాకూర్, ఆమె ఎవరు?

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : కేంద్ర మాజీ మంత్రిపై బీజేపీ సస్పెండ్

న్యాయం చేయాలంటూ డిఐజిని కలిసేందుకు పరుగులు తీసిన అత్యాచార బాధితురాలు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments