చెత్తకు ఆమెకు లింకేంటి.. యూ ట్యూబ్లో నవ్వులు పూయిస్తున్న యాడ్ (వీక్షించండి)
ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలో వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ఇందుకోసం ఆయన స్వచ్ఛభారత్ అనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనికి
ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలో వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ఇందుకోసం ఆయన స్వచ్ఛభారత్ అనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనికి విస్తృత ప్రచారం కల్పించే నిమిత్తం వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులను ప్రచారకర్తలుగా నియమించారు. వీరంతా పలు సందర్భాల్లో చీపుర్లు పట్టి వీధులను కూడా ఊడ్చారు. పోగైన చెత్తను ఎత్తి చెత్త కుండీల్లో వేశారు.
అయితే, బాలీవుడ్ సెలెబ్రిటీల్లో కంగనా రనౌత్ ఒకరు. స్వచ్ఛ భారత్పై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్తో ఓ యాడ్ చేయించారు. ఈ యాడ్ యూట్యూబ్లో నవ్వుల పువ్వులు పూయిస్తోంది. అంతేకాకుండా అవగాహన కూడా కల్పిస్తోంది. ఈ యాడ్లో కంగనా లక్ష్మీదేవిగా కనిపించడం విశేషం. ఈ యాడ్ కథేంటో మీరూ చూడండి.