Webdunia - Bharat's app for daily news and videos

Install App

"డీజే"కు తప్పని చిక్కులు: మళ్లీ సీన్లోకి బ్రాహ్మణ సంఘాలు.. నమక, చమకాలను శృంగారపరంగా ప్రస్తావిస్తారా?

డీజేకు వివాదాలతో చిక్కులు తప్పట్లేదు. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న దువ్వాడ జగన్నాథం సినిమా పాటపై బ్రాహ్మణులు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. డీ

Webdunia
మంగళవారం, 13 జూన్ 2017 (18:03 IST)
డీజేకు వివాదాలతో చిక్కులు తప్పట్లేదు. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న దువ్వాడ జగన్నాథం సినిమా పాటపై బ్రాహ్మణులు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. డీజేలోని రెండో పాట సాహితి రాసిన ‘గుడిలో బడిలో మడిలో ఒడిలో’... ‘అస్మైక యోగ తస్మైక భోగ’ అనే పాటపై త‌లెత్తిన వివాదం ఇంకా ముగియలేదు. ఈ పాటలోని అభ్యంతరకర పదాలను తొలగిస్తానని హామీ ఇచ్చిన హరీష్ చెప్పిన మాటను నిలబెట్టుకోలేదని బ్రాహ్మణ సంఘాలు ఫైర్ అవుతున్నాయి. 
 
ఆ పాట‌లోని "ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం.. ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం'' అంటూ హీరోయిన్‌ని వ‌ర్ణించ‌డం ప‌ట్ల బ్రాహ్మ‌ణ సంఘాలు ఇప్ప‌టికే ఎన్నో అభ్యంతరాలు వ్యక్తం చేసి, హ‌రీశ్ శంక‌ర్‌ను క‌లిశారు. హరీశ్ కూడా అగ్రహారం, తమలపాకు వంటి పదాలను తొలగిస్తామని మాటిచ్చారు. కానీ ఆ పదాలను తొలగించకుండానే హరీష్ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నారని బ్రాహ్మణ సంఘాలు తెలిపాయి. ఈ విష‌యంపై బ్రాహ్మ‌ణ సంఘాల స‌భ్యులు మంగళవారం తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌ను క‌లిసి ఫిర్యాదు చేశారు. 
 
దర్శకుడు హ‌రీశ్ శంక‌ర్ త‌మ‌ను ఇంత మోసం చేస్తాడా? అంటూ బ్రాహ్మణ సంఘాల స‌భ్యులు మండిపడుతున్నారు. శివుడికి ప్రీతికరమైన నమక, చమకాలను శృంగారపరంగా ప్రస్తావించడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాము ఇదే అంశంపై సెన్సార్ బోర్డుకి కూడా వెళ్లామ‌ని చెప్పారు. వారు కూడా స‌రిగా స్పందించ‌క‌పోతే వారి మీద కూడా న్యాయ పోరాటం చేయ‌డానికి సిద్ధంగా ఉన్నట్లు బ్రాహ్మణ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

తర్వాతి కథనం
Show comments