Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ దర్శకుడు తేజ‌కు కరోనా వైరస్ (Video)

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2020 (15:29 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో దర్శకుడు కరోనా వైరస్ బారినపడ్డారు. ఇటీవలే అగ్రశ్రేణి దర్శకుడు రాజమౌళి కరోనా బారినపడగా, తాజాగా డైరెక్టర్ తేజ కూడా కరోనా బాధితుల్లో ఒకరయ్యారు. ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది.
 
తేజ గతవారం ఓ వెబ్ సిరీస్ షూటింగులో పాల్గొన్నారు. ఆయనకు కరోనా సోకిన నేపథ్యంలో కుటుంబ సభ్యులకు, యూనిట్ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే అందరికీ కరోనా నెగెటివ్ వచ్చింది. తేజ ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. 
 
ఇదిలావుంటే, తెరాస నేత, కరీంనగర్‌కు చెందిన ఎమ్మెల్సీ నారదాసు లక్షణ్ రావు, ఆయన కుటుంబ సభ్యులు కరోనా బారినపడ్డారు. లక్ష్మణ్ డ్రైవర్, ఇద్దరు గన్‌మన్లు, ఇంట్లోని పనివారికి కూడా కరోనా సంక్రమించినట్టు నిర్ధారణ అయింది. మొత్తం 8 మందికి కరోనా సోకినట్టు తేలింది. 
 
ప్రస్తుతం నారదాసు కుటుంబం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కాగా, టీఆర్ఎస్‌కే చెందిన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కూడా నిన్న కరోనా బారినపడ్డారు. 

 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments