టాలీవుడ్లో మరో అరుదైన కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కనుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ దర్శకుడు శంకర్, ఏస్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కాంబినేషన్లో ఓ చిత్రం నిర్మితం కానుంది.
నిజానికి లాక్డౌన్లో ప్రతి హీరో రెండు మూడు సినిమాలకు సైన్ చేసి.. ప్రకటనలు కూడా చేశారు. కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం 'ఆర్ఆర్ఆర్' తర్వాత చేసే సినిమాని ఇంతవరకు ప్రకటించలేదు.
మధ్యలో ఇద్దరు, ముగ్గురు దర్శకులతో చరణ్ సినిమా అంటూ పేర్లు వినిపించినా.. అవేవీ ఫైనల్ కాలేదు. తాజాగా 'ఆర్ఆర్ఆర్' తర్వాత రామ్ చరణ్ చేయబోయే చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.
మెగా పవర్స్టార్ చెర్రీ, శంకర్ కాంబినేషన్లో ఓ మూవీ రానుంది. శంకర్ దర్శకత్వంలో జెంటిల్మేన్, ప్రేమికుడు, ఇండియన్, జీన్స్, ఒకే ఒక్కడు, అపరిచితుడు, రోబో, 2.0 వంటి భారీ బడ్జెట్ చిత్రాలు వచ్చి, ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసిన విషయం తెల్సిందే.
ఇపుడు డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో టాలీవుడ్లో సూపర్ డూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై హిట్ చిత్రాల నిర్మాత దిల్రాజు, శిరీష్ నిర్మాతలుగా ప్రెస్టీజియస్ మూవీగా భారీ బడ్జెట్తో ప్యాన్ ఇండియా చిత్రం రూపొందనుందని అధికారికంగా ప్రకటించారు.
A milestone film for us! #SVC50 will unite two big forces as never seen before