Webdunia - Bharat's app for daily news and videos

Install App

దర్శకరత్న దాసరికి తీవ్ర అస్వస్థత : ఐసీయూలో అడ్మిట్

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన దర్శక దిగ్గజం దాసరి నారాయణ రావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలోని ఐసీయూలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

Webdunia
మంగళవారం, 31 జనవరి 2017 (11:42 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన దర్శక దిగ్గజం దాసరి నారాయణ రావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలోని ఐసీయూలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 
 
నిజానికి ఆయన గత మూడు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ రాగా, ఆయన ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తూ వచ్చారు. ఈ క్రమంలో మంగళవారం ఆయనకు ఓ చిన్నపాటి సర్జరీ చేయాల్సి ఉండగా, అస్వస్థతకు గురైనట్టు వార్తలు గుప్పుమన్నాయి. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితిపై స్పష్టమైన వివరాలు తెలియాల్సి ఉంది. 
 
కొంతకాలం క్రితం దాసరికి బైపాస్ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన కోలుకున్నప్పటికీ, అనారోగ్యం ఆయన్ని ఇబ్బందిపెడుతూనే ఉంది. దాసరి ఆరోగ్యపరిస్థితిపై ఆస్పత్రి వర్గాలు ఇంకా స్పందించలేదు. 
 
కానీ, దాసరి ఆరోగ్య పరిస్థితిపై ఆయన మేనేజర్ స్పందించారు. ప్రతి యేడాది చలికాలంలో దాసరికి ఆరోగ్య రెగ్యులర్‌గా చేయించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ చెకప్‌లలో భాగంగానే ప్రస్తుతం కిమ్స్ ఆస్పత్రిలో చేరినట్టు తెలిపారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మంగళగిరి ఎయిమ్స్‌లో ర్యాగింగ్.. నిందితుల్లో డీన్స్ కుమారుడు? 25 మందిపై సస్పెన్షన్!!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉగ్రవాదులా? ఇద్దరి అరెస్టు కూడా...

పవన్ కళ్యాణ్‌పై క్రిమినల్ కేసు.. అంత నేరం ఏం చేశారు?

రైలు టిక్కెట్ కౌంటర్ల వద్ద క్యూ లైన్లకు ముగింపు.. ఎలా?

Social media: సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకోవాలి.. జగన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments