మేఘా ఆకాశ్‌కు సూపర్ ఛాన్స్.. నీదీ నాదీ ఒకటే లోకం అంటూ రాజ్‌తరుణ్‌తో..?

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (12:49 IST)
మేఘా ఆకాశ్ సూపర్ ఛాన్స్ కొట్టేసింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు .. దర్శకుడు కృష్ణారెడ్డితో ఒక సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ దర్శకుడు ఇంతకుముందు 'ఆడు మగాడ్రా బుజ్జీ' సినిమా చేశాడు. రాజ్ తరుణ్‌ను కథానాయకుడిగా ఎంచుకున్న దిల్ రాజు .. కథానాయికగా మేఘా ఆకాశ్‌ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 'నీదీ నాదీ ఒకటే లోకం' పేరుతో త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. 
 
ప్రస్తుతం ఈ సినిమాపైనే మేఘా ఆకాశ్‌ ఆశలు పెట్టుకుంది. కాగా 'లై' సినిమా ద్వారా మేఘా ఆకాశ్ తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా తరువాత మళ్లీ నితిన్ జోడీ కడుతూ 'ఛల్ మోహన్ రంగా' చేసింది. కానీ ఈ రెండు సినిమాలు ఫట్ అయ్యాయి. దాంతో ఈ అమ్మాయికి ఇక్కడ అవకాశాలు ముఖం చాటేశాయి. అందరిలానే తాను కూడా తమిళ చిత్రపరిశ్రమకి వెళ్లి అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. 
 
ఇప్పటికే అత్తారింటికి దారేదీ తమిళ రీమేక్‌లో మేఘా ఆకాశ్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. దీంతో దిల్ రాజు నిర్మించే తాజా సినిమా కోసం మేఘా ఆకాశ్ కసరత్తులు మొదలెట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరూర్‌ బాధితులను కలిసిన టీవీకే చీఫ్ విజయ్ - దర్యాప్తు చేపట్టిన సీబీఐ

నత్తలా నడుచుకుంటూ వస్తున్న మొంథా తుఫాను, రేపు రాత్రికి కాకినాడకు...

పెరగనున్న ఏపీ జిల్లాల సంఖ్య.. ఆ రెండు జిల్లాల భాగాలను విలీనం చేస్తారా?

తుఫాను ప్రారంభమైంది... భూమిని సమీపించే కొద్దీ తీవ్రమవుతుంది.. ఏపీఎస్డీఎంఏ

ఇంటి ముందు పెరిగిన గడ్డిని తొలగిస్తున్న యువతిని కాటేసిన పాము.. మూడు ముక్కలైనా..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments