Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేఘా ఆకాశ్‌కు సూపర్ ఛాన్స్.. నీదీ నాదీ ఒకటే లోకం అంటూ రాజ్‌తరుణ్‌తో..?

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (12:49 IST)
మేఘా ఆకాశ్ సూపర్ ఛాన్స్ కొట్టేసింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు .. దర్శకుడు కృష్ణారెడ్డితో ఒక సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ దర్శకుడు ఇంతకుముందు 'ఆడు మగాడ్రా బుజ్జీ' సినిమా చేశాడు. రాజ్ తరుణ్‌ను కథానాయకుడిగా ఎంచుకున్న దిల్ రాజు .. కథానాయికగా మేఘా ఆకాశ్‌ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 'నీదీ నాదీ ఒకటే లోకం' పేరుతో త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. 
 
ప్రస్తుతం ఈ సినిమాపైనే మేఘా ఆకాశ్‌ ఆశలు పెట్టుకుంది. కాగా 'లై' సినిమా ద్వారా మేఘా ఆకాశ్ తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా తరువాత మళ్లీ నితిన్ జోడీ కడుతూ 'ఛల్ మోహన్ రంగా' చేసింది. కానీ ఈ రెండు సినిమాలు ఫట్ అయ్యాయి. దాంతో ఈ అమ్మాయికి ఇక్కడ అవకాశాలు ముఖం చాటేశాయి. అందరిలానే తాను కూడా తమిళ చిత్రపరిశ్రమకి వెళ్లి అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. 
 
ఇప్పటికే అత్తారింటికి దారేదీ తమిళ రీమేక్‌లో మేఘా ఆకాశ్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. దీంతో దిల్ రాజు నిర్మించే తాజా సినిమా కోసం మేఘా ఆకాశ్ కసరత్తులు మొదలెట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sonu Sood: తిరుమలలో చిరు వ్యాపారిని పలకరించిన సోనూ సూద్ (video)

న్యూజిలాండ్‌లో కరోనా విజృంభణ - భారత్‌లో 5 వేలు దాటిన కరోనా

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

Vijayawada: వైజాగ్ కాలేజీలకు డ్రగ్స్ సప్లై.. కొరియర్, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు, సరఫరా

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments