Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేఘా ఆకాశ్‌కు సూపర్ ఛాన్స్.. నీదీ నాదీ ఒకటే లోకం అంటూ రాజ్‌తరుణ్‌తో..?

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (12:49 IST)
మేఘా ఆకాశ్ సూపర్ ఛాన్స్ కొట్టేసింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు .. దర్శకుడు కృష్ణారెడ్డితో ఒక సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ దర్శకుడు ఇంతకుముందు 'ఆడు మగాడ్రా బుజ్జీ' సినిమా చేశాడు. రాజ్ తరుణ్‌ను కథానాయకుడిగా ఎంచుకున్న దిల్ రాజు .. కథానాయికగా మేఘా ఆకాశ్‌ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 'నీదీ నాదీ ఒకటే లోకం' పేరుతో త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. 
 
ప్రస్తుతం ఈ సినిమాపైనే మేఘా ఆకాశ్‌ ఆశలు పెట్టుకుంది. కాగా 'లై' సినిమా ద్వారా మేఘా ఆకాశ్ తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా తరువాత మళ్లీ నితిన్ జోడీ కడుతూ 'ఛల్ మోహన్ రంగా' చేసింది. కానీ ఈ రెండు సినిమాలు ఫట్ అయ్యాయి. దాంతో ఈ అమ్మాయికి ఇక్కడ అవకాశాలు ముఖం చాటేశాయి. అందరిలానే తాను కూడా తమిళ చిత్రపరిశ్రమకి వెళ్లి అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. 
 
ఇప్పటికే అత్తారింటికి దారేదీ తమిళ రీమేక్‌లో మేఘా ఆకాశ్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. దీంతో దిల్ రాజు నిర్మించే తాజా సినిమా కోసం మేఘా ఆకాశ్ కసరత్తులు మొదలెట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్ నగరంలో జన్మించిన రెండు తలల శిశువు

బెట్టింగ్ యాప్‌లో లూడో ఆడాడు.. రూ.5లక్షలు పోగొట్టుకున్నాడు.. చివరికి ఆత్మహత్య

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments