డబ్బు కన్నా మానవ సంబంధాలు గొప్ప.. ఇదే 'శ్రీనివాస కళ్యాణం' స్టోరీ

ఈ కాలంలో డబ్బు కన్నా మానవ సంబంధాలు గొప్ప అని చాటిచెప్పడమే "శ్రీనివాస కళ్యాణం" కథ అని సినీ నిర్మాత దిల్ రాజు చెప్పుకొచ్చారు. నితిన్ - రాశిఖన్నా జంటగా 'దిల్' రాజు నిర్మిస్తున్న చిత్రం శ్రీనివాస కళ్యాణం.

Webdunia
మంగళవారం, 29 మే 2018 (14:44 IST)
ఈ కాలంలో డబ్బు కన్నా మానవ సంబంధాలు గొప్ప అని చాటిచెప్పడమే "శ్రీనివాస కళ్యాణం" కథ అని సినీ నిర్మాత దిల్ రాజు చెప్పుకొచ్చారు. నితిన్ - రాశిఖన్నా జంటగా 'దిల్' రాజు నిర్మిస్తున్న చిత్రం శ్రీనివాస కళ్యాణం. ఈ చిత్రం పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుండగా, సతీశ్ వేగేశ్న దర్శకుడు.
 
ఈ చిత్రం స్టోరీపై నిర్మాత దిల్ రాజు స్పందిస్తూ, డబ్బు కన్నా మానవ సంబంధాలు గొప్పవని చాటి చెప్పడమే ప్రధానంగా ఈ సినిమా కొనసాగుతుందని చెప్పారు. 'ఆర్థికపరమైన సంబంధాలకే ఎక్కువగా విలువనిచ్చే ప్రకాశ్ రాజ్, ఒక తెలుగింటి పెళ్లికి అతిథిగా వస్తాడట. అనుబంధాలు.. ఆత్మీయతలు.. మానవ సంబంధాల్లోని గొప్పతనం ఆయనకి అక్కడే అర్థమవుతుందట. ఆయనకి కనువిప్పు కలిగించడమే ధ్యేయంగా ఈ కథ నడుస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. 
 
గతంలో కూడా దిల్ రాజు వెంకటేష్, మహేష్ బాబు కాంబినేషన్‌లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాన్ని నిర్మించిన విషయం తెల్సిందే. ఈ చిత్రంలో కూడా కుటుంబ బంధాన్ని అద్భుతంగా చూపించిన విషయం తెల్సిందే. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ ఆటో డ్రైవర్ నిజాయితీకి నిలువుటద్దం... బ్యాగు నిండా డబ్బు దొరికినా... (వీడియో)

అమరావతిలో రూ.260 కోట్లతో శ్రీవారి ఆలయం.. శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం చంద్రబాబు

సర్పంచ్ కుర్చీ కోసం ఆగమేఘాలపై వివాహం - తీరా చూస్తే ఆశలు గల్లంతయ్యాయి..

పదేపదే వేడినీళ్లు అడుగుతున్నాడు.. అతనో పిచ్చోడు.. వరుడిపై వధువు మండిపాటు

ChatGPT: 16 ఏళ్ల బాలుడి ఆత్మహత్యకు బాధ్యత వహించని ఓపెన్ఏఐ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments