Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెట్‌ఫ్లిక్స్ సంస్థపై ధనుష్ కేసు.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్

ఠాగూర్
బుధవారం, 27 నవంబరు 2024 (14:06 IST)
ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌‍ఫాం నెట్‌ఫ్లిక్స్‌పై కోలీవుడ్ హీరో ధనుష్ కేసు పెట్టారు. ఈ మేరకు ఆయన మద్రాస్ హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. హీరోయిన్ నయనతార బయోగ్రఫీ కోసం తాను నిర్మాతగా తెరకెక్కించిన నానుమ్ రౌడీదా చిత్రంలోని పలు క్లిప్లింగ్స్‌ను అనుమతి లేకుండా ఉపయోగించారంటూ ఆయన ఆరోపించారు.
 
ఇదే అంశంపై ఇప్పటికే నయనతార, విఘ్నేష్ శివన్‌లపై రూ.10 కోట్ల మేరకు పరువు నష్టందావా వేసిన విషయం తెల్సిందే. ఇపుడు నెట్ ఫ్లిక్స్ సంస్థపై దావా వేశారు. బుధవారం ఈ పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం దీనిపై విచారణకు అంగీకరించింది. డాక్యుమెంటరీ విషయంలో నయనతార, ధనుష్ మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.
 
ఇక తమకెంతో ముఖ్యమైన నానుమ్ రౌడీ దాన్ విశేషాలను తన డాక్యుమెంటరీలో చూపించాలని కోరినా.. చిత్ర నిర్మాత ధనుష్ నుంచి పర్మిషన్ రాలేదని అందుకు తాను ఎంతో బాధపడ్డానని పేర్కొంటూ నయనతార ఇటీవల ఒక బహిరంగ లేఖ రిలీజ్ చేశారు. డాక్యుమెంటరీ ట్రైలర్‌లో మూడు సెకన్ల సీన్స్ ఉపయోగించినందుకు పరిహారంగా ఆయన రూ.10 కోట్లు డిమాండ్ చేశారని తెలిపారు. ఈసందర్భంగా ధనుష్‌ను నయనతార తప్పుబట్టిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Good News: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. పెండింగ్ బకాయిల విడుదల

పార్లమెంట్ ఆవరణలో అరకు కాఫీ స్టాల్!!

తప్పు చేశా.. ఇకపై బెట్టింగులకు ప్రమోట్ చేయను : శ్యామల

నల్గొండలో టెన్త్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ - 11 మంది అరెస్టు

Pawan Kalyan: తమిళనాడులో జనసేన ఏర్పాటు.. స్టాలిన్‌ను కొనియాడిన పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments