Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లల కోసం ఒక్కటయ్యారు... ఒకే చోట ధనుష్ - ఐశ్వర్య

Webdunia
మంగళవారం, 23 ఆగస్టు 2022 (10:29 IST)
తల్లిదండ్రులు ఎవరైనా జీవించేది తమ సంతానం కోసమే. చాలా మంది దంపతులు విడాకులు తీసుకున్నప్పటికీ తమ పిల్లల జీవితాల్లో జరిగే సంతోషకరమైన రోజున ఒక్కటిగా కలుస్తుంటారు. అదేవిధంగానే ఇపుడు కోలీవుడ్ హీరో ధనుష్, ఆయన మాజీ భార్య ఐశ్వర్య రజనీకాంత్ కలిశారు. వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించిన తర్వాత వారిద్దరూ ఒకే వేదికపై కనిపించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
ధనుష్ - ఐశ్వర్య దంపతుల పెద్ద కుమారుడు యాత్ర తాను చదివే స్కూల్‌లో స్పోర్ట్స్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ధనుష్, ఐశ్వర్య దంపతులు హాజరయ్యారు. భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ తమ పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని, వారికి మంచి తల్లిదండ్రులుగా ఉండాలనే కోణంలో ఆలోచన చేసి వారిద్దరూ ఒకచోట కలవడం నిజంగానే అభినందనీయం. 
 
తెలుగు చిత్రపరిశ్రమలో కూడా హీరో పవన్ కళ్యాణ్ తన రెండో భార్య, సినీ హీరోయిన్ రేణూ దేశాయ్‌కు విడాకులు ఇచ్చారు. కానీ, వీరిద్దరూ తమ పిల్లల పుట్టినరోజు వేడుకలు, ఇతక శుభకార్యాల్లో కలుసుకుంటున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జపాన్‌ను దాటేసిన ఇండియా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments