Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లల కోసం ఒక్కటయ్యారు... ఒకే చోట ధనుష్ - ఐశ్వర్య

Webdunia
మంగళవారం, 23 ఆగస్టు 2022 (10:29 IST)
తల్లిదండ్రులు ఎవరైనా జీవించేది తమ సంతానం కోసమే. చాలా మంది దంపతులు విడాకులు తీసుకున్నప్పటికీ తమ పిల్లల జీవితాల్లో జరిగే సంతోషకరమైన రోజున ఒక్కటిగా కలుస్తుంటారు. అదేవిధంగానే ఇపుడు కోలీవుడ్ హీరో ధనుష్, ఆయన మాజీ భార్య ఐశ్వర్య రజనీకాంత్ కలిశారు. వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించిన తర్వాత వారిద్దరూ ఒకే వేదికపై కనిపించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
ధనుష్ - ఐశ్వర్య దంపతుల పెద్ద కుమారుడు యాత్ర తాను చదివే స్కూల్‌లో స్పోర్ట్స్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ధనుష్, ఐశ్వర్య దంపతులు హాజరయ్యారు. భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ తమ పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని, వారికి మంచి తల్లిదండ్రులుగా ఉండాలనే కోణంలో ఆలోచన చేసి వారిద్దరూ ఒకచోట కలవడం నిజంగానే అభినందనీయం. 
 
తెలుగు చిత్రపరిశ్రమలో కూడా హీరో పవన్ కళ్యాణ్ తన రెండో భార్య, సినీ హీరోయిన్ రేణూ దేశాయ్‌కు విడాకులు ఇచ్చారు. కానీ, వీరిద్దరూ తమ పిల్లల పుట్టినరోజు వేడుకలు, ఇతక శుభకార్యాల్లో కలుసుకుంటున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments