Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రముఖ సినీ నటులపై ఢిల్లీ పోలీసుల కేసు.. ఎందుకు?

Webdunia
ఆదివారం, 5 సెప్టెంబరు 2021 (12:11 IST)
'దిశ రేప్​' ఘటనకు సంబంధించి ప్రముఖ సినీనటులపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అత్యాచార బాధితురాలి పేరును సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేసినందుకుగాను వారిపై ఈ కేసులు నమోదు చేశారు. 
 
గత 2019లో హైదరాబాద్​లో జరిగిన దిశ హత్యాచారానికి సంబంధించి.. ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, టాలీవుడ్ నటుడు రవితేజ, నటి రకుల్​ ప్రీత్ సింగ్​ సహా 38 మందిపై కేసు నమోదైంది. 
 
బాధితురాలి పేరును సామాజిక మాధ్యమాల వేదికగా బహిర్గతం చేసినందుకు ప్రముఖులను అరెస్టు చేయాలని కోరుతూ దిల్లీ తీస్ హజారీ కోర్టులో న్యాయవాది గౌరవ్ గులాటీ పిటిషన్​ దాఖలు చేశారు. 
 
అలాగే, సెక్షన్ 228ఏ కింద ప్రముఖులపై కేసు నమోదు చేయాలని సబ్జీ మండీ పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు గౌరవ్. బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, అజయ్ దేవ్​గన్, అభిషేక్ బచ్చన్, ఫరాన్ అక్తర్, అనుపమ్ ఖేర్ సహా టాలీవుడ్ నటులు రవితేజ, అల్లు శిరీష్, నటి ఛార్మి పేర్లను ఫిర్యాదులో పేర్కొన్నారు గౌరవ్. హర్బజన్ సింగ్, శిఖర్ ధావన్, సైనా నెహ్వాల్ పై కూడా కేసు నమోదు చేయాలని కోరారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిథున్ రెడ్డికి షాకిచ్చిన సుప్రీంకోర్టు... సరెండర్‌కు కూడా నో టైమ్..

Hyderabad: పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు..

Hyderabad: స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25- ఆరవ పరిశుభ్రమైన నగరంగా హైదరాబాద్

ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో లాలూకు చిక్కులు.. కేసు విచారణ వేగవంతం చేయాలంటూ...

భార్యాపిల్లలను బావిలో తోసేశాడు... ఆపై గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments