Webdunia - Bharat's app for daily news and videos

Install App

జపాన్ భూకంపంపై జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి...

Webdunia
మంగళవారం, 2 జనవరి 2024 (08:43 IST)
కొత్త సంవత్సరం రోజున జపాన్ దేశం భారీ భూకంపంతో వణికిపోయింది. దీనిపై టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. జపాన్‌‍లో సంభవించిన వరుస భూకంపాల ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులతో కలిసి కొత్త సంవత్సరం వేడుకలను జపాన్‌లో జరుపుకున్నారు. అలాగే, ఆయన చిత్రం షూటింగ్ కూడా జపాన్‌లో జరిగింది. ఒకవైపు షూటింగ్ పూర్తికావడంతో, మరోవైపు, కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుని సోమవారం రాత్రి హైదరాబాద్ నగరానికి తిరిగివచ్చారు. తాను నటిస్తున్న కొత్త చిత్రం దేవర షూటింగులో వారం రోజుల జపాన్‌లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో జపాన్‌లో సంభవించిన వరుస భూకంపాలపై ఆయన స్పందించారు. 
 
"దేవర" చిత్రీకరణ జరిపిన ప్రాంతంలో భూకంపం రావడం తన హృదయాన్ని కలిచివేసిందన్నారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు త్వరగా కోలుకోవాలని తారక్ ట్వీట్ చేశారు. జపాన్ దేశంలో సోమవారం దాదాపు 21 సార్లు భూమి కంపించిన విషయం తెల్సిందే. దీంతో జపాన్ పశ్చిమ ప్రాంతం అల్లకల్లోలమైంది. ఈ భూకంపం ధాటికి ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు. వరుసగా సంభవించిన భూకంపాలతో ప్రభుత్వం తొలుత భారీ సునామీ హెచ్చరికలు చేసింది. దీంతో సముద్రతీర ప్రాంతాల వాసులను ఖాళీ చేయాలని ఆదేశించింది. ఆ తర్వాత సునామీ హెచ్చరికల తీవ్రతను తగ్గించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కత్తులు గొడ్డళ్లతో 52 మందిని నరికివేశారు... ఎక్కడ?

లేడీ కానిస్టేబుల్‌ను ఈడ్చుకెళ్లిన తాగుబోతు ఆటో డ్రైవర్

నేడు తీరందాటనున్న వాయుగుండం : ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన

ముంబై మహానగరంలో రెడ్ అలెర్ట్ .. ఎందుకో తెలుసా?

ఏపీలో 'స్త్రీశక్తి' అనూహ్య స్పందన - ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం సిగపట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments