Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్‌కు జోడీగా దీపికా పదుకునే..?

Webdunia
ఆదివారం, 1 మార్చి 2020 (13:14 IST)
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రాధాకృష్ణ దర్శకత్వంలో కొత్త సినిమా రూపుదిద్దుకుంటోంది. పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కనున్న ఈ మూవీలో ప్రభాస్‌కు జోడిగా పూజా హెగ్డే నటిస్తుంది. కాగా ఈ మూవీ సెట్స్‌ఫై ఉండగానే మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఓ మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నారు. 
 
ఈ చిత్రం గురించి నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ఇది కేవలం పాన్ ఇండియా సినిమా కాదని, పాన్ వరల్డ్ సినిమా అని అన్నారు. దీన్నిబట్టి చిత్రం ఎంత భారీగా ఉండనుందో అర్థమవుతోంది. ఈ సినిమా కోసం భారీ తారాగణాన్ని తీసుకుంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్ రోల్ కోసం ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకునేను తీసుకునే ఆలోచనలో ఉన్నారని టాక్. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు మొదలైనట్టు ఫిల్మ్ నగర్ టాక్.
 
మరోవైపు ప్రభాస్ చేస్తున్న 'జాన్' చిత్రం పూర్తవగానే కొత్త సినిమా మొదలు కానుంది. మహానటి సినిమా తరహాలో భారీ బడ్జెట్ చిత్రంగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నట్టు సమాచారం.  

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments