Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయాలు రోత రోత.. ఎన్టీఆర్, వైఎస్సార్ గ్రేట్.. సినీ పరిశ్రమ వల్లే డ్రగ్స్ పెరగలేదు

ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు జంప్ జలానీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుత రాజకీయాలు నానాటికీ దిగజారిపోతున్నాయన్నారు. రాజకీయ నాయకుల్లో ఎన్టీఆర్, రాజశేఖరరెడ్డి ఇద్దరూ గొప్ప నాయకులని స

Webdunia
బుధవారం, 16 ఆగస్టు 2017 (10:34 IST)
ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు జంప్ జలానీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుత రాజకీయాలు నానాటికీ దిగజారిపోతున్నాయన్నారు. రాజకీయ నాయకుల్లో ఎన్టీఆర్, రాజశేఖరరెడ్డి ఇద్దరూ గొప్ప నాయకులని సురేష్ బాబు తెలిపారు. నిర్ణయాలను అత్యంత వేగంగా తీసుకోవడంలో వీరికి ఎవరూ సాటిరారని కొనియాడారు.  
 
అయితే ప్రస్తుత రాజకీయ నేతలు ప్రజలచే ఎన్నుకొనబడుతున్నామనే విషయాన్ని మరిచి.. పదవి కోసం, అధికారం కోసం ఇతర పార్టీలకు మారిపోతున్నారని ఫైర్ అయ్యారు. ఒక పార్టీ తరపున పోటీచేసి గెలిచాక.. మరో పార్టీ ఆశచూపితే ఆ పార్టీరి జంప్ కావడం ముమ్మాటికీ అధికారాన్ని దుర్వినియోగపరచడమే అవుతుందన్నారు. 
 
జనం పార్టీ మీదో, లేదా రాజకీయ నేతపైనే నమ్మకంతో ఓటేసి గెలిపిస్తే.. ఆ పార్టీకి పనిచేయక పార్టీలు మారడం విలువలను వదులుకోవడమే అవుతుందని సురేష్ బాబు తెలిపారు. నమ్మి ఓటేసిన ఓటర్లను మోసం చేయడం రాజకీయ నాయకులకు అలవాటుగా మారిందని విమర్శించారు. మద్యం, డ్రగ్స్, ధూమపానం సినిమాలు రాకముందు నుంచే ఉన్నాయని... సినీ పరిశ్రమ వల్ల అవి పెరగలేదని చెప్పారు. ఏ రంగానికైనా క్రమశిక్షణ అనేది అవసరమన్నారు..

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments