Webdunia - Bharat's app for daily news and videos

Install App

పృథ్వీరాజ్‌తో సహా బ్లెస్సీ యూనిట్.. ఎడారిలో చిక్కుకుపోయింది.. ఆకలితో..?

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (12:35 IST)
Prithivraj
మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ హీరోగా, బ్లెస్సీ ద‌ర్శ‌క‌త్వంలో 'ఆడు జీవితం' పేరిట ఓ చిత్ర నిర్మాణం మొదలైంది. కథలో భాగంగా సినిమా షూటింగ్‌ను జోర్డాన్ ఎడారిలో జరపాలని భావించారు. అక్క‌డి ప‌రిస్థితులు బాగోలేవ‌ని కొందరు చెప్పినా, చిత్ర యూనిట్ వినకుండా అక్కడికి వెళ్లింది. చివరికి అక్కడికి వెళ్లిన తరువాత క‌రోనా తీవ్ర‌రూపం దాల్చింది. 
 
భారత దేశంతో పాటు పలు దేశాలు లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో.. విమానాలు వచ్చే పరిస్థితులు లేకపోవడంతో, వారంతా అక్కడే చిక్కుకుపోయారు. తిండి లేక నానా ఇబ్బంది పడుతున్నారట. తమను ఎలాగైనా భారత్‌కు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని యూనిట్ సభ్యులు కోరుతున్నారు. 
 
జోర్డాన్‌లోని ఎడారి ప్రాంతంలోకి వెళ్లిన బ్లెస్సీ యూనిట్.. ఎటూ కదిలే దారి లేక, యూనిట్ మొత్తం ఆకలి బాధలు పడుతోందట. వారిని ఎలాగైనా వెనక్కు రప్పించాలని మాలీవుడ్ ప్రముఖులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు నటుడు పృథ్వీరాజ్ సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. ఏప్రిల్ 2వ తేదీ వరకు ముందుగా ప్లాన్ చేసుకున్న రీతిలో వసతి, ఆహారం, సామాగ్రి వుందని.. కానీ ఆ తర్వాత ఏమౌతుందో ఏమోనని తెలిపాడు. 

సంబంధిత వార్తలు

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments