Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రామసేతు'కు కరోనా దెబ్బ.. అక్షయ్‌తో పాటు 45 మందికి కోవిడ్ పాజిటివ్

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (14:22 IST)
బాలీవుడ్‌ను కరోనా కుదిపేస్తోంది. అక్షయ్ కుమార్ కథానాయకుడిగా 'రామసేతు' సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. అయితే.. అది మొదలైన కొద్ది రోజులకే హీరో అక్షయ్ కుమార్‌కు కరోనా అని తేలింది. దాంతో ఆయన హోమ్ ఐసొలేషన్‌కు వెళ్లిపోయారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి ముందే ఇందులో పాల్గొనే వారికి కోవిడ్ 19 పరీక్షలు చేశామని చిత్ర నిర్మాతలు చెబుతున్నారు. 
 
అయినా కూడా షూటింగ్ మొదలైన తర్వాత 45 మంది జూనియర్ ఆర్టిస్టులకు కరోనా సోకినట్టు తెలిసిందట. దాంతో వీరందరికీ అక్షయ్ కుమార్ హోమ్ ప్రొడక్షన్ హౌస్ తో పాటు ఈ చిత్ర నిర్మాతలు తమ సొంత ఖర్చుతో చికిత్స చేయిస్తున్నారట. షూటింగ్ సమయంలో నటీనటులు, సాంకేతిక నిపుణులకు టెస్టులు చేయించడానికి వైద్య బృందాన్ని, తగినన్ని పీపీఇ కిట్స్‌ను అందుబాటులో ఉంచామని నిర్మాతలు చెబుతున్నారు. 
 
ఇందుకోసం లక్షల రూపాయలను ఖర్చు చేస్తున్నారట. అయితే... కరోనా కేసులు ఇలానే పెరిగితే మాత్రం రాబోయే రోజుల్లో సినిమా షూటింగ్ ను నిర్మాతలు రద్దు చేయాల్సిన పరిస్థితి రావచ్చు. ఇది 'రామసేతు'కు మాత్రమే పరిమితం అవుతుందనీ చెప్పలేం. మొత్తం బాలీవుడ్ లోనూ షూటింగ్స్ ఆగిపోయే ప్రమాదమూ ఉంది.

సంబంధిత వార్తలు

తెలంగాణాలో తొలిసారి రికార్డు స్థాయి ధర పలికిన ఫ్యాన్సీ నంబర్!!

ఆత్మాహుతి దాడులకు పాల్పడేందుకు ప్రవేశించిన ఐసిస్ ఉగ్రవాదులు

పల్నాడు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన మలికా గార్గ్!!

తెలంగాణాకు శుభవార్త - జూన్ 5 -11 మధ్య నైరుతి రుతుపవనాలు ప్రవేశం!

బిల్లులు చెల్లించని జగన్ సర్కారు.. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత!!?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments