Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలర్స్‌పై జరిమానా.. రంభ, రాశి ఇలాంటి పనులు చేయొద్దు.. ఫోరమ్ వార్నింగ్

Webdunia
శనివారం, 23 ఫిబ్రవరి 2019 (11:15 IST)
ప్రకటనల పట్ల సినీ తారలు అప్రమతతంగా వుండాలని వినియోగదారుల ఫోరం న్యాయమూర్తి మాధవరావు హెచ్చరించారు. ఊబకాయం తగ్గిస్తామని, మీరు కూడా సినీ తారల్లా సన్నజాజి తీగల్లా నాజూగ్గా మారిపోవచ్చని వస్తున్న ప్రకటనల పట్ల మోసపోయే వారు చాలామంది వున్నారని.. ఇలాంటి ప్రకటనల్లో కనిపించేందుకు ముందు బాగా ఆలోచించుకోవాలని వినియోగదారుల ఫోరం స్పష్టం చేసింది.


ఇందులో భాగంగా వెయిట్ లాస్‌పై రాశి, రంభలతో రూపొందించిన యాడ్స్‌ను తక్షణమే నిలిపివేయాలంటూ వినియోగదారుల ఫోరం న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి విజయవాడలో వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించడంతో వెయిట్ లాస్ సైడ్ అఫెక్ట్స్ వెలుగులోకి వచ్చాయి. కలర్స్ అనే వెయిట్ లాస్ సంస్థ టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు రాశి, రంభలతో ప్రత్యేకంగా యాడ్ రూపొందించిన సంగతి తెలిసిందే. ఆ సంస్థ ప్రకటన చూసి తాను ట్రీట్ మెంట్ తీసుకుని మోసపోయానని బాధితుడు వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు. 
 
ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన వినియోగదారుల ఫోరం.. బాధితుడి ట్రీట్మెంట్ కోసం చెల్లించిన రూ.74,652 మొత్తానికి 9 శాతం వడ్డీ కలిపి వెంటనే చెల్లించాలంటూ ఆదేశించారు. ఈ సందర్భంగా సెలబ్రిటీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనల్లో నటించడం మానుకోవాలని సూచించారు. ఇకపై ఇలాంటి ప్రకటనల్లో కనిపిస్తే సెలెబ్రిటీలకు కూడా జరిమానా తప్పదని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మే నెలలో అమరావతిలో పర్యటించనున్న ప్రధాని మోడీ

వారం రోజుల్లో ఏపీ పదవ తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాలు

వడదెబ్బను రాష్ట్ర విపత్తుగా ప్రకటిస్తూ తెలంగాణ ఉత్తర్వులు

వర్షిణిని పెళ్లాడిన లేడీ అఘోరి - వీడియో ఇదిగో...

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అనారోగ్యం.. కేబినేట్ సమావేశాల సంగతేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments