Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

ఠాగూర్
ఆదివారం, 20 జులై 2025 (19:05 IST)
ప్రముఖ సినీ నిర్మాత ఏఎం రత్నంపై పలువురు ఫిర్యాదులు చేశారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర చలనచిత్రాభివృద్ధి మండలికి రెండు వేర్వేరు ఫిర్యాదులు అందాయి. నైజాం ఏరియా పంపిణీకి సంబంధించి రెండు సినిమాలకుగానూ ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన డబ్బును ఇప్పటివరకు చెల్లించలేదని ఆ ఫిర్యాదుల్లో ఆయా సంస్థల ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. 
 
రత్నం నిర్మాతగా తెరకెక్కించిన 'ఆక్సిజన్' మూవీకి సంబంధించి దాదాపు రూ.2.50 కోట్ల రివరీపై ఏషియన్ ఎంటర్‌ప్రైజెస్, 'ముద్దుల కొడుకు', 'బంగారం' చిత్రాలకు సంబంధించిన రూ.90 వేల రికవరీపై మహాలక్ష్మి ఫిల్మ్స్ సంస్థలు ఫిర్యాదులు చేశాయి. రత్నం నిర్మించిన కొత్త సినిమా 'హరిహర వీరమల్లు' విడుదలకు ముందు ఆ బాకీ మొత్తం వసూలు చేయడంలో సహాయం చేయాలని అభ్యర్థించాయి. 
 
ఈ విషయంలో ఇతర పంపిణీదారులు  సహకరించాలని కోరారు. అయితే, ఈ ఫిర్యాదులు 'హరిహర వీరమల్లు' విడుదకు అడ్డంకిగా మారుతాయా? లేదా? అనేది తెలియాల్సివుంది. కాగా, పవన్ కళ్యాణ్ - నిధి అగర్వాల్ జంటగా నటించిన 'హరిహర వీరమల్లు' చిత్రం ఈ నెల 24వ తేదీన విడుదలకానున్న విషయం తెల్సిందే. ఈ చిత్రానికి రత్నం కుమారుడు జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అసెంబ్లీలో వ్యవసాయంపై చర్చ : ఆన్‌లైన్‌ రమ్మీ గేమ్‌లో నిమగ్నమైన వ్యవసాయ మంత్రి

పిన్నెల్లి బూత్ క్యాప్చర్‌ను ఎదిరించిన టీడీపీ కార్యకర్త ఇకలేరు...

ప్రియురాలు కానిస్టేబుల్‌ను హత్య చేసి ఠాణాలో లొగిపోయిన ఏఎస్ఐ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments