Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాస్యనటుడు బ్రహ్మానందం స్కెచ్-బాపు బొమ్మ అదుర్స్

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2020 (10:54 IST)
Brahmanandam
కరోనా లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన హాస్యనటుడు బ్రహ్మానందం తనలోని చిత్రకళకు పదును పెట్టారు. చిత్రలేఖనంలో తనకున్న ప్రావీణ్యాన్ని చాటుతూ ఈ మధ్య వరుసగా చిత్రాలు గీస్తున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా జాతిపిత బాపు స్కెచ్‌ను అద్భుతంగా గీసారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
 
బ్రహ్మానందం తన కామెడీతో నవ్వించడమే కాకుండా చిత్ర లేఖనంతోను అలరిస్తున్నారు. గతంలో ప్రేమతో రాముడిని ఆలింగనం చేసుకున్న హనుమంతుడు ఆనందబాష్పాలు కారుస్తున్నట్లుగా ఓ పెన్సిల్ స్కెచ్‌ వేశారు. అలానే లాక్‌డౌన్‌తో కరోనాను కట్టడి చేయొచ్చనే భావాన్ని స్ఫురించేలా ఓ చిత్రాన్ని గీశారు. శ్రీశ్రీ బొమ్మని కూడా అచ్చు గుద్దినట్టు వేశారు. బ్రహ్మానందం స్కెచ్‌లకు అభిమానలు ముగ్ధులవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh: ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. పాఠశాలల్లో ఇకపై రాజకీయాలు వుండవు

Sheep Scam: గొర్రెల పెంపకం అభివృద్ధి పథకంలో అవినీతి.. 33 జిల్లాల్లో రూ.1000 కోట్లకు పైగా నష్టం

Say No To Plastic: ఏపీ సెక్రటేరియట్‌లో ప్లాస్టిక్‌కు నో.. ఉద్యోగులకు స్టీల్ వాటర్ బాటిల్

హనీమూన్‌లో భర్త తాగుబోతు అని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన వివాహిత

నిత్య పెళ్లికూతురు - 15 యేళ్లలో 8 మందిని పెళ్లాడిన కి'లేడీ' టీచర్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments