అపోలో ఆసుపత్రిలో ప్రముఖ గుండె శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ విజయ్ దీక్షిత్ను అపోలో ఆసుపత్రి ఛైర్మన్ ప్రతాప్రెడ్డి ప్రముఖుల సమక్షంలో సన్మానించారు. సోమవారంనాడు హైదరాబాద్లో జరిగిన ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, హైదరాబాద్ మేయర్తోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
వైద్యశాస్త్ర ప్రకారం..ఇప్పటికి దీక్షిత్ 20వేల గుండె శస్త్రచికిత్సలు చేసి అరుదైన రికార్డ్ను నెలకొల్పారు. 1991లో మొదటి కార్డియాక్ శస్త్రచికిత్స చేసిన డాక్టర్ దీక్షిత్, ఈ ఏడాది మార్చినాటికి మైలురాయిని చేరుకున్నారు.
దేశంలో ఓపెన్హార్ట్ సర్జరీలో విశేష అనుభవం వున్న వారిలో దీక్షిత్ ఒకరు. కాగా, 1991 నుంచి 1993వరకు ఎటువంటి మరణాలు లేకుండ తీవ్రమైన గుండె సమస్యలను పరిష్కరించారు. డాక్టర్ దీక్షిత్ బాటింగ్ హార్ట్స్లో భారత్లోనే కరోనరీ బైపాస్సర్జీరీ, అంతర్గత క్షరీ ఆర్టెరీ గ్రాఫ్ట్, కరోనరీ ఎండార్టిరిక్టోమిస్, బైపాస సర్జరీ వంటి మార్గ దర్ఘక అనేక ఆధునిక పద్ధతులను ఆయన చేశాడు.
లక్నోకు చెందిన డా. దీక్షిత్.. హైదరాబాద్వచ్చాక అదే తన మాతృస్థలంగా భావించి సెటిల్ అయ్యారు. ఎందరో శస్త్రచికిత్సలు చేసవారున్నా.. ఇటువంటి గౌరవరం దక్కడం వృత్తికే గౌరవాన్ని తెచ్చిందని..దీక్షిత్ ఈ సందర్భంగా అన్నారు.