Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ సినీ కార్మికులకు వేతనాలు పెంపు.. జూలై నుంచి అమలు

Webdunia
శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (08:22 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచారు. ఈ పెంపు దాదాపు 30 శాతంగా ఉంది. ఈ పెంచిన వేతనాలు కూడా ఈ యేడాది జూలై నుంచే అందజేయనున్నారు. ఈ మేరకు ఫిల్మ్ చాంబర్, ఫిల్మ్ ఫెడరేషన్, నిర్మాతల మండలిలు సంయుక్తంగా ఓ ప్రకటన చేశాయి. 
 
వేతనాల పెంపునకు సంబంధించి బుధవారం కీలక చర్చలు జరిగాయి. అయితే, ఎంత మేరకు పెంపు, ఎప్పటి నుంచి అమలు వంటి కీలక అంశాలపై గురువారం కీలక నిర్ణయం వెలువడింది. ఈ మేరకు చిత్ర పరిశ్రమ నుంచి సంయుక్త ప్రకటన వెలువడింది. 
 
ఈ ప్రకటన మేరకు పెద్ద చిత్రాలకు పనిచేసే కార్మికులకు 30 శాతం మేరకు వేతనాలు పెంచనున్నారు. అదేసమయంలో చిన్న చిత్రాలకు పని చేసే కార్మికులకు మాత్రం 15 శాతం మేరకు వేతనాలు పెంచనున్నారు. అయితే, ఇది చిన్న చిత్రం, ఏది పెద్ద సినిమా అనే విషయాన్ని మాత్రం చలనచిత్ర వాణిజ్య మండలి, ఎంప్లాయీస్ ఫెడరేషన్‌లతో కూడిన ఒక కమిటి నిర్ణయిస్తుంది. 
 
ఇకపోతే, పెంచిన వేతనాలను కూడా ఈ యేడాది జూలై నుంచే అమలులు చేయనున్నట్టు ప్రకటించారు. ఫలితంగా కార్మికులకు అరియర్స్ కూడా అందనున్నాయి. ఈ కొత్త వేతన ఒప్పందం వచ్చే 2025 వరకు అమల్లోకి రానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Marri Rajasekhar: వైకాపాకు మరో ఎదురుదెబ్బ- ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా (video)

Vishnupriya: పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు యాంకర్ విష్ణుప్రియ

Rain: వేసవి కాలంలో వర్షాలు పడే అవకాశాలు.. మార్చి 22, 23 తేదీల్లో భారీ వర్షాలు

భర్తను 15 ముక్కలు చేసి.. ప్రియుడితో కలిసి విహార యాత్ర

Viral Mass Video: జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని పట్టుకున్న నారా లోకేష్.. వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments