Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్ల క్లబ్‌లోకి "వాల్తేరు వీరయ్య" ఎంట్రీ

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (19:57 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం "వాల్తేరు వీరయ్య". బాబి కొల్లి దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానరుపై నిర్మించిన ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటించగా, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. పూర్తి స్థాయిలో మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 
 
బారీ ఓపెనింగ్స్‌తో మొదలైన ఈ చిత్రం 10 రోజులు గడిచిపోయినా కలెక్షన్ల జోరు ఏమాత్రం తగ్గలేదు. ప్రపంచ వ్యాప్తంగా 3 రోజుల్లో రూ.108 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసిన ఈ చిత్రం పది రోజుల్లోనే రూ.200 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడిస్తూ, ఓ పోస్టరును కూడా వెల్లడించింది. 
 
కాగా, చిరంజీవి మాస్ యాక్షన్‌కు రవితేజ క్రేజ్ తోడుకావడం, డీఎస్పీ మాస్ బీట్స్ కనెక్ట్ కావడం, రామ్ లక్ష్మణ్ ఫైట్స్‌, చిరంజీవి కామెడీకి మంచి మార్కులు పడ్డాయి. అలాగే, ఈ చిత్రంలోని పాటలకు శేఖర్ మాస్టర్ అందించిన నృత్య రీతులు కూడా యువతను విశేషంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఫలితంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ది గోల్కొండ బ్లూ- అరుదైన నీలి వజ్రం- మే 14న జెనీవాలో వేలానికి సిద్ధం (video)

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని పరిస్థితి విషమం

తిరుగుబాటు చట్టాలను అమలు చేయనున్న డోనాల్డ్ ట్రంప్ - 20న ఆదేశాలు జారీ!

అయ్యప్ప భక్తులకు శుభవార్త - ఇకపై బంగారు లాకెట్ల విక్రయం

వీరాభిమానికి స్వయంగా పాదరక్షలు తొడిగిన నరేంద్ర మోడీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments