Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్ల క్లబ్‌లోకి "వాల్తేరు వీరయ్య" ఎంట్రీ

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (19:57 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం "వాల్తేరు వీరయ్య". బాబి కొల్లి దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానరుపై నిర్మించిన ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటించగా, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. పూర్తి స్థాయిలో మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 
 
బారీ ఓపెనింగ్స్‌తో మొదలైన ఈ చిత్రం 10 రోజులు గడిచిపోయినా కలెక్షన్ల జోరు ఏమాత్రం తగ్గలేదు. ప్రపంచ వ్యాప్తంగా 3 రోజుల్లో రూ.108 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసిన ఈ చిత్రం పది రోజుల్లోనే రూ.200 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడిస్తూ, ఓ పోస్టరును కూడా వెల్లడించింది. 
 
కాగా, చిరంజీవి మాస్ యాక్షన్‌కు రవితేజ క్రేజ్ తోడుకావడం, డీఎస్పీ మాస్ బీట్స్ కనెక్ట్ కావడం, రామ్ లక్ష్మణ్ ఫైట్స్‌, చిరంజీవి కామెడీకి మంచి మార్కులు పడ్డాయి. అలాగే, ఈ చిత్రంలోని పాటలకు శేఖర్ మాస్టర్ అందించిన నృత్య రీతులు కూడా యువతను విశేషంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఫలితంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments