Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిబ్రవరి 4న వస్తున్న 'ఆచార్య' - క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (07:46 IST)
మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ కాంబినేషన్‌లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "ఆచార్య". ఈ చిత్రాన్ని వచ్చే యేడాది ఫిబ్రవరి 4వ తేదీనే రిలీజ్ చేయాలని చిత్ర నిర్మాతలు నిర్ణయించి, ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. 
 
నిజానికి జనవరి 7వ తేదీన 'ఆర్ఆర్ఆర్' చిత్రం విడుదలవుతుంది. ఆ తర్వాత సంక్రాంతి రేస్‌లో 'భీమ్లా నాయక్', 'రాధేశ్యామ్', 'సర్కారువారిపాట' వంటి భారీ బడ్జెట్ చిత్రాలు ఉన్నాయి. దీంతో 'ఆచార్య' చిత్రాన్ని మరోమారు వాయిదావేయనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లుకొట్టాయి.
 
వీటిపై చిత్ర బృందం ఓ క్లారిటీ ఇచ్చింది. 'ముందుగా ప్రకటించినట్టుగా ఫిబ్రవరి 4వ తేదీన చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నాం. డబ్బింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. అందరి అంచనాల్ని అందుకునేలా ఈ సినిమాను తీర్చిదిద్దాం' అని చిత్ర బృందం తెలిపింది. 
 
కాగా, ఈ చిత్రంలో చిరంజీవి ఆచార్యుడుగాను, నక్సలైట్‌గా రెండు విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నారు. అలాగే, ఆచార్యకు అండదండలు అందించే పాత్రలో ఆయన తనయుడు రామ్ చరణ్ ఓ కీలకమైన సిద్ధ పాత్రలో కనిపించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

andhra pradesh weather report today ఆంధ్ర ప్రదేశ్ రేణిగుంటలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత

Sri Reddy: పోలీసుల విచారణకు హాజరైన నటి శ్రీరెడ్డి.. క్షమించమని కోరినా వదల్లేదు

Smita Sabharwal, నాకు ఒక్కదానికే నోటీసా, 2 వేల మందికి కూడానా?: స్మితా సభర్వాల్ ప్రశ్న

speak in Hindi, ఏయ్... ఆటో తోలుతున్నావ్, హిందీలో మాట్లాడటం నేర్చుకో: కన్నడిగుడితో హిందీ వ్యక్తి వాగ్వాదం (video)

Lavanya: రాజ్ తరణ్ కేసు కొలిక్కి రాదా? లావణ్యతో మాట్లాడితే ఏంటి ఇబ్బంది? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments