Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంగస్థలం సినిమా సెట్‌లో చిరంజీవి, రాజమౌళి.. ఫోటోలు వైరల్

''రంగస్థలం 1985'' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సుకుమార్ దర్శకత్వంలో చెర్రీ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ జూబ్లీహిల్స్ జరుగుతోంది. 'రంగస్థలం 1985'లో సమంత హీరోయిన్‌గా నటిస్తున్నారు. అనసూయ, జగప

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2017 (11:25 IST)
''రంగస్థలం 1985'' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సుకుమార్ దర్శకత్వంలో చెర్రీ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ జూబ్లీహిల్స్ జరుగుతోంది. 'రంగస్థలం 1985'లో సమంత హీరోయిన్‌గా నటిస్తున్నారు. అనసూయ, జగపతిబాబు, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 
 
మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. 1985 నాటి పరిస్థితులు ప్రతిబింబించేలా ఈ చిత్రం కోసం రూ. 5 కోట్లతో సెట్‌ను కూడా వేశారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
 
ఈ నేపథ్యంలో సినిమా సెట్‌లో మెగాస్టార్‌ చిరంజీవి, జక్కన్న ఎస్‌.ఎస్‌. రాజమౌళి సందడి చేశారు. మంగళవారం సెట్‌కు వెళ్లిన వీరిద్దరు యూనిట్‌ సభ్యులతో కాసేపు సరదాగా గడిపినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మగధీర తర్వాత చెర్రీ-జక్కన్న కాంబోలో మరో సినిమా వచ్చే అవకాశం ఉన్నట్లు వదంతులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చెర్రీ సినిమా సెట్‌కు జక్కన్న వెళ్లడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments