Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రహ్మపుత్ర నదీజలాల సమాచారాన్ని పంచుకునేందుకు సై..

బ్రహ్మపుత్ర నదీజలాలకు సంబంధించిన డేటాను భారత్‌తో పంచుకునేందుకు చైనా సిద్ధమైంది. టిబెట్‌లో డేటా కలెక్షన్ స్టేషన్ అప్‌గ్రేడేషన్ పేరుతో భారత్‌తో ఆ డేటాను పంచుకోలేమంటూ గతేడాది చైనా తేల్చి చెప్పింది. అయితే

Webdunia
గురువారం, 29 మార్చి 2018 (11:25 IST)
బ్రహ్మపుత్ర నదీజలాలకు సంబంధించిన డేటాను భారత్‌తో పంచుకునేందుకు చైనా సిద్ధమైంది. టిబెట్‌లో డేటా కలెక్షన్ స్టేషన్ అప్‌గ్రేడేషన్ పేరుతో భారత్‌తో ఆ డేటాను పంచుకోలేమంటూ గతేడాది చైనా తేల్చి చెప్పింది. అయితే ప్రస్తుతం ఇరు దేశాలకు చెందిన అత్యున్నత స్థాయి అధికారులు జరిపిన చర్చలు ఫలించడంతో బ్రహ్మపుత్ర నదీజలాలకు సంబంధించిన డేటాను భారత్‌తో పంచుకునేందుకు సై అంటూ చైనా ప్రకటించింది.
 
వరదలను అంచనా వేసేందుకు అత్యంత అవసరమైన ఈ డేటాను పంచుకోవడాన్ని చైనా ఆపివేయడంతో అప్పట్లో భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరుచుకునే దిశగా ఈ సమాచారాన్ని భారత్ పంచుకునేందుకు నిర్ణయించినట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి లు కాంగ్ చెప్పారు. 
 
కాగా డోక్లామ్ ప్రాంతం గురించి భారత్- చైనాల మధ్య గతేడాది 73 రోజుల పాటు ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంతో బ్రహ్మపుత్ర నదీ జలాల సమాచారాన్ని ఇచ్చేందుకు డ్రాగన్ నిరాకరించింది. అయితే, చైనాలోని హాంగ్‌ఝౌ నగరంలో భారత్-చైనా ఉన్నతస్థాయి అధికారులు జరిపిన చర్చలు సఫలమవడంతో.. నదీ జలాల సమాచారాన్ని పంచుకోనున్నట్టు చైనా ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments