ఐశ్వర్యా రాయ్ - ఆరాధ్యకు కరోనా పాజిటివ్... జయా బచ్చన్ రిపోర్టు ఏంటి?

Webdunia
ఆదివారం, 12 జులై 2020 (15:27 IST)
బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్‌ ఫ్యామిలీ కరోనా వైరస్ బారినపడ్డారు. అమితాబ్ భార్య జయాబచ్చన్ మినహా మిగిలిన వారందరికీ ఈ వైరస్ సోకింది. అమితాబ్, ఆయన కుమారుడు అభిషేక్‌లకు కరోనా సోకినట్టు శనివారం తేలింది.
 
ఆ తర్వాత అమితాబ్ కోడలు ఐశ్వర్యా రాయ్, మనుమరాలు ఆరాధ్య, భార్య జయాబచ్చన్‌లకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఐశ్వర్యా, ఆరాధ్యలకు కరోనా పాజిటివ్ అని తేలినట్టు సమాచారం. 
 
ఈ ఉదయం ఐశ్వర్య, ఆరాధ్యలకు తెమడ పరీక్ష చేయగా నెగెటివ్ వచ్చిందని ముంబయి నగర మేయర్ కిశోరి పెడ్నేకర్ తెలిపారు. అయితే, రెండో టెస్టులో వారిద్దరికీ పాజిటివ్ వచ్చిందని బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) కమిషనర్ వెల్లడించారు.
 
ఇక, అమితాబ్ అర్ధాంగి జయా బచ్చన్‌కు యాంటీజెన్ టెస్టులో నెగెటివ్ వచ్చినట్టు తెలిసింది. అమితాబ్ కుటుంబంలో పలువురికి కరోనా సోకడంతో వారి నివాస భవనం 'జల్సా'ను బీఎంసీ అధికారులు మూతవేసి శానిటైజ్ చేశారు. కాగా, అమితాబ్, అభిషేక్ ముంబైలోని నానావతి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కూల్‌డ్రింక్స్‌లో మత్తు కలిపి పురుషుడుపై మహిళ అత్యాచారం ... ఎక్కడ?

దేశ వ్యాప్తంగా ఇండిగో విమానాలు రద్దు - రైళ్లకు అదనపు బోగీలు

టేకాఫ్ అవుతుండగా విమానంలో అగ్నిప్రమాదం.. 180 మంది ప్రయాణికులు పరిస్థితి??

ఆపరేషన్ చేసి సర్జికల్ బ్లేడ్‌ను మహిళ కడపులో వదేలేశారు...

పవన్ కళ్యాణ్ వివాదంపై నాలుక మడతేసిన మంత్రి వెంకట్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments