Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోయపాటి శీను చేతుల మీదుగా జై శబరీశ్వర!

Webdunia
గురువారం, 26 నవంబరు 2015 (15:59 IST)
బోయపాటి శీను చేతులమీదుగా 'జై శబరీశ్వర' అయ్యప్ప భక్తిగీతాలు ఆవిష్కరణ కార్తీక పౌర్ణమి శుభదినాన్ని పురస్కరించుకుని 'జై శబరీశ్వర' అయ్యప్ప భక్తిగీతాల ఆవిష్కరణ కార్యక్రమం హైద్రాబాద్‌లో జరిగింది. ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను సీడీలను ఆవిష్కరించి.. హీరో శ్రీకాంత్‌, రమణారెడ్డి, గిరిలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత కొంగలి మహేష్‌, శ్రీధర్‌రావు మరియు పాటల రచయిత దేవరాజ్‌ పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా నిర్మాత కొంగలి మహేష్‌ మాట్లాడుతూ..''కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మా ఈ 'జై శబరీశ్వర' ఆల్బమ్‌ను బోయపాటి శ్రీనుగారు, శ్రీకాంత్‌ ఆవిష్కరించడం సంతోషంగా ఉంది. అయ్యప్ప భక్తులందరికీ నచ్చే విధంగా ఈ ఆల్బమ్‌ రూపొందించడం జరిగింది. దేవరాజ్‌ చక్కని సాహిత్యాన్ని అందించారు...'' అన్నారు. 
 
నటుడు రమణారెడ్డి మాట్లాడుతూ..''నా స్నేహితులు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ భక్తిగీతాలు విన్న ప్రతి ఒక్కరూ అయ్యప్ప నామస్మరణ జపించడం ఖాయం..'' అని అన్నారు. ఈ ఆల్బమ్‌కి సాహిత్యం: దేవరాజ్‌, గానం: జంగిరెడ్డి, నిర్మాత: కొంగలి మహేష్‌.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments