మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను ఈసారి కొత్త హీరోను సక్సెస్ చేసే పనిలో వున్నాడని తెలుస్తోంది. సరైనోడు చిత్రానికి ముందుగానే.. బెల్లంకొండ సురేష్ కొడుకు శ్రీనివాస్తో సినిమా చేయాల్సి వుంది. అయితే పాత్ర రీత్యా పక్కా మాస్ క్యారెక్టర్. అందులో హీరో.. కండలు తిరిగేవాడుగా వుండాలి. కానీ అది శ్రీనివాస్కు సాధ్యంకాకపోవడంతో.. కథను మార్చి.. ఈసారి ఎలాగైనా.. బెల్లంకొండ శ్రీనును గట్టెంక్కెంచే పనిని భుజాన వేసుకున్నాడు.
ఇందుకు నిర్మాత ఆయన కోరినంత ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. లవ్ స్టోరీతో పక్కా మాస్ అంశాలతో చిత్రాన్ని తీర్చిదిద్దే పనిలో వున్నారు. ప్రీ ప్రొడక్షన్స్ పనులు ముగింపు దవకు వచ్చేశాయి. నెలరోజుల్లో సెట్పైకి వెళ్ళనున్నట్లు సమాచారం.
అయితే ఈ చిత్రంలో కొత్తగా కొంతమంది హీరోలను కూడా తెరపైకి కన్పించేట్లుగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు స్టార్స్ ఈ సినిమాలో స్పెషల్ రోల్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. వారు ఎవరు? ఎందుకు చేస్తున్నారనేది త్వరలో తెలియనుంది.