Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ నటి నర్సుగా మారి కరోనా రోగులకు సేవ, కానీ పక్షవాతం ఆమెను ఆక్రమించింది

Webdunia
మంగళవారం, 15 డిశెంబరు 2020 (20:20 IST)
ఫోటో కర్టెసీ-ట్విట్టర్
పరులకు సేవ చేయాల్సిన ఆలోచన అందరికీ ఉండదు. ఏ కొందరికో ఆ ఆశయం ఉంటుంది. అలాంటి వారిలో శిఖా మల్హోత్రా ఒకరు. సినిమాల్లో అడుగుపెట్టక ముందే నర్సింగ్ కోర్సు చేసిన శిఖ కరోనా బారిన పడినా ప్రజలకు తనవంతు సహాయం చేయాలనుకున్నారు.
 
లాక్ డౌన్ కాలంలో ముంబైలోని మున్సిపల్ కార్పొరేషన్లో నడిచే ఆసుపత్రిలో నర్సుగా చేరింది మల్హోత్రా. ఆరు నెలల పాటు నిద్రాహారాలు మానేసి రోగులకు సేవలందించింది. కానీ అనుకోని విషాదం ఆమె అందమైన జీవితాన్ని తలకిందులు చేసేసింది. గత అక్టోబర్ నెలలో కరోనా మహమ్మారి బారిన పడింది.
నెల రోజుల తరువాత కోలుకుంది. అయితే డిసెంబర్ 10వ తేదీన పక్షవాతానికి గురికావడంతో ఆమెను హుటాహుటిన ముంబైలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రానురాను ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆమె శరీరంలోని కుడివైపు భాగమంతా చచ్చుపడిపోయింది. నోటమాట కూడా రావడం లేదు. ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు. అయితే ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. మనమూ ప్రార్థిద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాఫీ బాగోలేదన్నందుకు హత్య చేసారా? కొత్తజంట హనీమూన్ మిస్సింగ్ మిస్టరీ

రౌడీ షీటర్లను పరామర్శించేందుకు వెళ్లిన జగన్... ప్రజా సంఘాల నిరసన

కెనరా బ్యాంకులో దొంగలుపడ్డారు... 59 కేజీల బంగారం మాయం

Kukatpally: కూకట్‌పల్లిలో రూ.2కోట్ల డ్రగ్స్‌తో ముఠా అరెస్ట్

ఆగివున్న ట్యాంకర్‌ను ఢీకొన్న కారు : ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

తర్వాతి కథనం
Show comments