Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్ తరుణ్ వ్యక్తిగత జీవితం గురించి తెలియదు... అది ఆయన పర్సనల్ : మాల్వీ మల్హోత్రా

వరుణ్
గురువారం, 11 జులై 2024 (19:01 IST)
హీరో రాజ్ తరుణ్ జీవితంలో జరుగుతున్న సంఘటనలన్నీ ఆయన వ్యక్తిగతమని, ఆ వ్యక్తిగత జీవితం గురించి తనకు తెలియదని హీరోయిన్ మాల్వీ మల్హోత్రా అన్నారు. తాను రాజ్‌ తరుణ్‌తో కలిసి నటించానని, అంతేకానీ, ఆయన వ్యక్తగత జీవితం గురించి తెలుసుకోలేదని వ్యాఖ్యానించారు. "తిరగబడర సామీ" అనే చిత్రంలో మాల్వీ మల్హోత్రా హీరోయిన్ కాగా, రాజ్ తరుణ్ హీరో. ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్‌పై పదేళ్లపాటు సహజీవనం చేస్తూ వచ్చిన నటి లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. మాల్వీ మల్హోత్రా పరిచయమైన తర్వాత రాజ్ తరుణ్ తనను పక్కనపెట్టేశాడని, తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా సమర్పించారు. దీంతో రాజ్‌తరుణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
ఈ అంశంపై బాలీవుడ్ నటి మాల్వీ మల్హోత్రా స్పందిస్తూ, రాజ్ తరుణ్ జీవితంలో ఏం జరుగుతుందో తనకు తెలియదన్నారు. అది ఆయన పర్సనల్ అని చెప్పారు. అంతే తప్ప ఆయన వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోలేదన్నారు. సినిమా ప్రచారంలో భాగంగానే రాజ్ తరుణ్‌తో కలిసి తిరిగానని చెప్పారు. తనపై ఆరోపణలు చేసిన లావణ్య గురించి రాజ్ తరుణ్ గతంలో ఎపుడూ తనతో మాట్లాడలేదన్నారు. ఇలాంటి ఆరోపణలు తనపై వస్తాయని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంచి విమర్శలను స్వీకరిస్తానని, కానీ, ఇలాంటి నెగెటివ్ కామెంట్స్ గురించి అస్సలు పట్టించుకోనని చెప్పారు.
 
ప్రస్తుతానికి తాను సింగిల్ అని... ప్రస్తుతం తన దృష్టంతా కెరీర్‌పైనే ఉందన్నారు. సినిమానే తన ఫస్ట్ అని చెప్పారు. రాజ్ తరుణ్ వ్యక్తిగత జీవితం గురించి తనకు తెలియదని, అందుకే సినిమా గురించే మాట్లాడలనుకున్నట్టు మాల్వీ మల్హోత్రా చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

టీడీపీ నక్రాలు చేస్తే 10 మంది ఎంపీలను బీజేపీ లాగేస్తుంది : ప్రొఫెసర్ నాగేశ్వర్ (Video)

ఢిల్లీ హైకోర్టు జడ్జి నివాసంలో అగ్నిప్రమాదం.. మంటలు ఆర్పివేశాక బయటపడిన నోట్ల కట్టలు!!

Two headed snake: శివాలయంలో రెండు తలల పాము.. వీడియో వైరల్

దేశ, ప్రపంచ నగరాల్లో శ్రీవారి ఆలయాలు.. బాబు వుండగానే క్యూలైన్‌లో కొట్టుకున్న భక్తులు.. (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments