Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచి చేయాలనుకున్నపుడు ఎదురుదెబ్బలు సహజం : సోనుసూద్

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (15:27 IST)
సాధారణంగా మంచి చేయాలన్నపుడు ఎదురు దెబ్బలు తగలడం సహజమని బాలీవుడ్ నటుడు సోనుసూద్ అన్నారు. కరోనా కష్టకాలంలో ఎంతో మందిని ఆదుకుని రియల్ హీరోగా కనిపించారు. అలాంటి సోనుసూద్ నివాసాలు, ఆఫీసుల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. 
 
ఈ ఐటీ సోదాలపై సోనుసూద్ స్పందించారు. 'మనం ఏదైనా మంచి చేయాలని నిర్ణయించుకున్నప్పుడు.. ఎన్నో సవాళ్లు ఎదుర్కొవాల్సి ఉంటుంది' నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ మాట వింటున్నాను. అలాంటి సమస్యలు ఎదుర్కొన్నవాడిలో నేనే మొదటివాడినని అనుకోవడం లేదు. ఐటీ అధికారులు మా ఇంటికి రాగానే.. సమాచారాన్ని అడిగి తెలుసుకుని దాడులు సక్రమంగా జరిగేందుకు వాళ్లకు అన్ని రకాలుగా సహకరిస్తానని చెప్పాను. 
 
ఐటీ దాడులు జరగడానికి ముఖ్యమైన కారణమేమిటనేది నాకు కూడా సరిగ్గా తెలీదు. కొంతమంది దీనిని రాజకీయ కోణంలో చూస్తున్నారు. కొన్నిరోజుల క్రితం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ని కలవడం వల్లే ఈ దాడులు జరిగాయంటూ నెట్టింట్లో పోస్టులు పెడుతున్నారు. 
 
అయితే, అది రాజకీరపరమైన మీటింగ్‌ కాదని కేజ్రీవాల్‌తో భేటీ ముగిసినప్పుడే చెప్పాను. చిన్నారులందరూ చదువుకొనేలా చూడటమే నా ప్రధాన లక్ష్యమని చెప్పాను కూడా. ఇక, ఈ దాడుల నా అభిమానులు కొంతమేర ఆగ్రహంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్లు నన్ను తమ కుటుంబసభ్యుడిలా భావించారు’ అని సోనూసూద్‌ వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments